Rahul Gandhi: తొక్కిసలాట జరిగిన హత్రాస్లో పర్యటించనున్న రాహుల్ గాంధీ..
- హత్రాస్లో పర్యటించనున్న రాహుల్ గాంధీ..
- తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలకు పరామర్శ..
- 123 మంది ప్రాణాలు బలిగొన్న విషాద ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: 120కి పైగా ప్రజల ప్రాణాలను తీసిన భయంకరమైన తొక్కిసలాట ఉత్తర్ ప్రదేశ్లోని హత్రాస్లో జరిగింది. ఈ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భోలో బాబాగా పిలువబడే వ్యక్తి నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమానికి లక్షల మంది జనాలు రావడం, బాబా పాదధూళి కోసం జనాలు ఎగబడటం ఒక్కసారిగా తొక్కిసలాటకు కారణమైంది. ఈ ఘటనలో 123 మంది మరణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇతర దేశాధినేతలు ఈ సంఘటనపై తమ సంతాపాన్ని తెలియజేశారు. తొక్కిసలాట దుర్ఘటనపై విచారణకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్ను కూడా ఏర్పాటు చేసింది.
Read Also: Brain-eating amoeba: “మెదడును తినే అమీబా” ఇన్ఫెక్షన్తో 14 ఏళ్ల బాలుడి మృతి..
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఇదిలా ఉంటే ఈ విషాద ఘటన జరిగిన హత్రాస్ ప్రాంతాన్ని సందర్శించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ హత్రాస్లో పర్యటించే యోచనలో ఉన్నారని చెప్పారు. తొక్కిసలాట గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది దురదృష్టకర సంఘటన, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు (రాహుల్ గాంధీ) హత్రాస్ను సందర్శించాలని యోచిస్తున్నారు. ఆయన అక్కడికి వెళ్లి బాధిత ప్రజల పరామర్శిస్తారని చెప్పారు.
80 వేల మంది సరిపడే సౌకర్యాలు ఉన్నప్పటికీ 2.5 లక్షల మంది సత్సంగ్కి చేరుకోవడం కూడా ప్రమాద తీవ్రతను పెంచాయి. ఈ ఘటనకు కారణమైన భోలే బాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. అయితే, నిన్న అతని లాయర్ ద్వారా ఓ ప్రకటన చేస్తూ.. ఘటనలో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!