Bharat Jodo Yatra: మరికొన్ని గంటల్లో షురూ.. షెడ్యూల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Bharat Jodo Yatra Schedule Timings: కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు.. 12 రాష్ట్రాలను కలుపుతూ మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. తొలుత రాహుల్ గాంధీ రేపు ఉదయం 7 గంటలకు శ్రీ పెరంబదూర్లో రాజీవ్ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. తర్వాత కన్యాకుమారి చేరుకుని.. కామరాజ్ నాడార్, మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. 3 గంటలకు వివేకానంద రాక్ మెమొరియోల్, కామ్ రాజ్ మెమోరియల్, తిరివళ్లూర్ మెమోరియల్కు చేరుకొని.. ప్రార్థనలు నిర్వహించనున్నారు. మహాత్మాగాంధీ మండపం వద్ద నివాళులు అర్పించే సమయంలో.. తమిళనాడు సీఎం స్టాలిన్, చత్తీస్గఢ్ సీఎం భూపేష్ భగేల్, రాజస్థాన్ సీఎం గెహ్లాట్లు రాహుల్ గాంధీకి జాతీయ జెండాను అందిస్తారు. గాంధీ మండపం వద్దనున్న బీచ్ రోడ్లో సాయంత్రం 5 గంటలకు పబ్లిక్ మీటింగ్ని భారీఎత్తున నిర్వహించనున్నారు. ఈ మీటింగ్కు పార్టీ సీనియర్ నేతలతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు హాజరు కానున్నారు.
మీటింగ్ ముగిసిన తర్వాత.. భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 7 గంటలకు వివేకానంద పాలిటెక్నిక్ కాలేజ్ నుండి ఈ భారత్ జోడో యాత్ర షురూ కానుంది. ప్రతిరోజు కనీసం 20 నుంచి 24 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. ఉదయం 7:00 గంటల నుంచి 10:30 గంటల వరకు నిర్విరామంగా పాదయాత్ర చేస్తారు. అనంతరం 3:30 గంటల వరకు విరామం తీసుకోనున్నారు. మళ్లీ 3:30 నుంచి 7:30 వరకు రాహుల్ పాదయాత్ర చేస్తారు. ఇలా 150 రోజుల వరకు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా మొత్తం 3,570 కిలోమీటర్లు నడిచి.. కశ్మీర్కు చేరుకోనున్నారు రాహుల్ గాంధీ. ‘ఏక్ తేరా కదమ్, ఏక్ మేరా కదమ్, మిల్ జాయే జుడ్ జాయే అప్నా వతన్’ నినాదంతో సాగనున్న ఈ పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ స్థానిక ప్రజల్ని కలుస్తూ.. పాదయాత్ర ఎందుకు చేస్తున్నానో వివరించనున్నారు. 117 మందితో కూడిన రాహుల్ గాంధీ టీమ్ ఈ భారత్ జోడో యాత్రలో పాల్గొననుంది.
Also Read
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!