Rahul Gandhi: ఎక్కడ SIR ఉంటే, అక్కడ ఓట్ల దొంగతనం జరుగుతుంది..
- SIR ఎక్కడ ఉంటే అక్కడ ఓట్ల చోరీ జరుగుతుంది..
- మరోసారి ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ ఓట్లను దొంగిలించడానికి ప్రణాళికాబద్ధమైన కుట్రలో కీలక భాగస్వామిగా మారిందని ఆరోపించారు. ఓటర్లను ఎంపిక చేసి, ఓటు హక్కును తొలగించడానికి ఎన్నికల జాబితాను ఎస్ఐఆర్ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
గుజరాత్లో ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్నది పరిపాలనాపరమైన కసరత్తు కాదని, ఒక వ్యక్తి-ఒక ఓటు అనే రాజ్యాంగ సూత్రాన్ని దెబ్బతీసి, ప్రజల బదులుగా బీజేపీనే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడుతోందని, SIR ఉన్న చోటల్లా ఓటు దొంగతనం జరుగుతోందని, గుజరాత్లో కూడా ఇదే విధంగా ప్రణాళికాబద్ధమైన కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ ఎక్స్లో ఆరోపించారు. కాంగ్రెస్కు మద్దతు ఇచ్యచే నిర్దిష్ట వర్గాలు, కులాలు, పోలింగ్ బూత్ల నుంచి ఓట్లను తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకే పేరుతో వేల సంఖ్యలో అభ్యంతరాలు దాఖలయ్యాయని, బీజేపీకి ఓటమి భయం ఉన్న చోట్ల ఓటర్లు సిస్టమ్ నుంచి మాయమవుతున్నారని అన్నారు.
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
Read Also: Kalki 2 Update: ‘కల్కి 2’ సౌండ్ అద్భుతం.. హింట్ ఇచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్!
అలంద్, రాజురాలలో గతంలో ఇదే విధంగా జరిగిందని, ఎస్ఐఆర్ అమలు చేయబడిని గుజరాత్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే బ్లూ ప్రింట్ను అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఇకపై ప్రజాస్వామ్య రక్షకుడు కాదని, ఓట్ల దొంగతనం కుట్రలో కీలక భాగస్వామిగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ కాంగ్రెస్ కూడా ఈసీపై తీవ్ర ఆరోపణలు చేసింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై అభ్యంరాలకు చివరి తేదీ జనవరి 18గా పెట్టారని, జనవరి 15 వరకు తక్కువ సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయని , కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఫారమ్-7 ద్వారా లక్షల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయని ఆరోపించింది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం 12 లక్షల అభ్యంతరాలు వచ్చాయని చెప్పింది. ఒకే వ్యక్తి పేరుతో డజన్ల కొద్దీ అభ్యంతరాలు వచ్చినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..