Raghav Chadha: రాఘవ్ చద్దాకు అండగా కేంద్రం.. జెడ్ కేటగిరీ భద్రత కేటాయింపు!
- పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ కేంద్రం కీలక నిర్ణయం
- రాఘవ్ చద్దాకు జెడ్ కేటగిరీ భద్రత కేటాయింపు!
- దేశ రాజకీయ వర్గాల్లో కీలక చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు అనూహ్యంగా కేంద్రం జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో రాఘవ్ చద్దాకు ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించని షాకిచ్చింది. సభలో రాఘవ్ చద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని రాజ్యసభ ఛైర్మన్కు లేఖ రాసింది. దీంతో రాఘవ్ చద్దా తీవ్ర షాకింగ్కు గురయ్యారు. అనంతరం ఆప్ నేతలు తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. మోడీకి భయపడి.. ఎయిర్పోర్టుల్లోని సమోసాల ధరల గురించి మాట్లాడారంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడంతో ఆప్ ప్రభుత్వం భద్రత కూడా ఉపసంహరించుకుంది.
ఇదిలా ఉంటే రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాఘవ్ చద్దాకు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పరిణామం దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భద్రత వివరాలపై అధికారిక సమాచారం వెలువడకపోయినప్పటికీ… కేంద్ర నిర్ణయం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Marathi Test: మహారాష్ట్రలో 7,750 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మరాఠీ పరీక్షలో ఫెయిల్.. ఇక లైసెన్స్ పరిస్థితి ఏంటి?
- West Bengal Hotel Fire: బీర్భూమ్లో ఘోర అగ్నిప్రమాదం.. హోటల్లో ఏడుగురు సజీవ దహనం
- Bihar Temple Stampede: బిహార్ ఆలయంలో విషాదం.. అశోక్ధామ్ ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురు భక్తులు మృతి
- TVK Vijay Government: విజయ్ ప్రభుత్వానికి 100 రోజులు.. “డమ్మీ సీఎం” అంటూ విమర్శలు..!
ఇదిలా ఉంటే రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. ప్రస్తుతం ఉన్న 543 ఎంపీల సంఖ్యను 850కి పెంచే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. అయితే డీలిమిటేషన్ బిల్లుపై మాత్రం దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
జెడ్ కేటగిరీ..
జెడ్ కేటగిరీ (Z Category) భద్రత అనేది భారతదేశంలో తీవ్రమైన ముప్పు ఉన్న ప్రముఖులకు కల్పించే అత్యున్నత భద్రతా స్థాయిల్లో ఒకటి. ఈ భద్రతలో 22 మంది వరకు సాయుధ సిబ్బంది (4-6 మంది NSG కమాండోలతో సహా) రక్షణ కల్పిస్తారు. ఇది ప్రధానంగా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉన్నత స్థాయి ముప్పు ఉన్నవారికి మాత్రమే కల్పిస్తారు.
ఇది కూడా చదవండి: Vijay: డీలిమిటేషన్తో తమిళనాడుకు నష్టం.. పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు
తాజావార్తలు
-
Husharu Pittalu OTT Release: అమెజాన్ ప్రైమ్లోకి ‘హుషార్ పిట్టలు’.. బోల్డ్ టీనేజ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
-
Allari Naresh : కామెడీ స్టార్ ‘అల్లరి నరేశ్’ ఈసారైనా నవ్విస్తాడా?
-
Marathi Test: మహారాష్ట్రలో 7,750 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మరాఠీ పరీక్షలో ఫెయిల్.. ఇక లైసెన్స్ పరిస్థితి ఏంటి?
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
ట్రెండింగ్
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..