Raghav Chadha: రాఘవ్ చద్దాకు అండగా కేంద్రం.. జెడ్ కేటగిరీ భద్రత కేటాయింపు!
- పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ కేంద్రం కీలక నిర్ణయం
- రాఘవ్ చద్దాకు జెడ్ కేటగిరీ భద్రత కేటాయింపు!
- దేశ రాజకీయ వర్గాల్లో కీలక చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు అనూహ్యంగా కేంద్రం జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో రాఘవ్ చద్దాకు ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించని షాకిచ్చింది. సభలో రాఘవ్ చద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని రాజ్యసభ ఛైర్మన్కు లేఖ రాసింది. దీంతో రాఘవ్ చద్దా తీవ్ర షాకింగ్కు గురయ్యారు. అనంతరం ఆప్ నేతలు తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. మోడీకి భయపడి.. ఎయిర్పోర్టుల్లోని సమోసాల ధరల గురించి మాట్లాడారంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడంతో ఆప్ ప్రభుత్వం భద్రత కూడా ఉపసంహరించుకుంది.
ఇదిలా ఉంటే రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాఘవ్ చద్దాకు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పరిణామం దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భద్రత వివరాలపై అధికారిక సమాచారం వెలువడకపోయినప్పటికీ… కేంద్ర నిర్ణయం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
ఇదిలా ఉంటే రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. ప్రస్తుతం ఉన్న 543 ఎంపీల సంఖ్యను 850కి పెంచే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. అయితే డీలిమిటేషన్ బిల్లుపై మాత్రం దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
జెడ్ కేటగిరీ..
జెడ్ కేటగిరీ (Z Category) భద్రత అనేది భారతదేశంలో తీవ్రమైన ముప్పు ఉన్న ప్రముఖులకు కల్పించే అత్యున్నత భద్రతా స్థాయిల్లో ఒకటి. ఈ భద్రతలో 22 మంది వరకు సాయుధ సిబ్బంది (4-6 మంది NSG కమాండోలతో సహా) రక్షణ కల్పిస్తారు. ఇది ప్రధానంగా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉన్నత స్థాయి ముప్పు ఉన్నవారికి మాత్రమే కల్పిస్తారు.
ఇది కూడా చదవండి: Vijay: డీలిమిటేషన్తో తమిళనాడుకు నష్టం.. పక్షపాత చర్య వద్దని విజయ్ హితవు
తాజావార్తలు
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
-
Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!