Raghav Chadha vs AAP: మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా?
- రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం వేటుపై బహిరంగంగా స్పందించిన ఆప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంపీ రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రధాని మోడీకి భయపడి.. సమోసాల ధర గురించి మాట్లాడతావా? అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా ఇన్చార్జ్ అనురాగ్ ధండా, పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఉప నాయకుడి పదవి నుంచి రాఘవ్ చద్దా తొలగింపు తర్వాత ఆప్ బహిరంగంగా స్పందించింది.
ఇది కూడా చదవండి: Raghav Chadha: ‘‘నేను ఓడిపోలేదు.. నా మౌనం ఓటమి కాదు’’.. రాఘవ్ చద్దా ఆవేదన
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
రాఘవ్ చద్దా బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని అనురాగ్ ధండా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన విశ్వసనీయతను శంకించారు. రాఘవ్ చద్దాను అనురాగ్ ధండా ఎద్దేవా చేస్తూ.. ‘‘మీకు సమోసాల ధర తగ్గించాలా లేక దేశాన్ని కాపాడాలా అని ప్రశ్నించారు. గుజరాత్లో అరెస్టు అయిన పార్టీ కార్యకర్తలకు మద్దతుగా పార్లమెంటులో ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులపై ఎందుకు ఎటువంటి నిర్దిష్ట చర్య తీసుకోలేదని నిలదీశారు.
మోడీకి భయపడుతూ.. పార్టీ పోరాటాలకు దూరంగా ఉంటున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా, బహిరంగ వేదికలపై చద్దా పనితీరును అనురాగ్ ధండా ప్రశ్నించారు. ‘‘రాఘవ్.. నువ్వు గత కొన్నేళ్లుగా భయపడుతున్నావు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడుతున్నావు. ఎవరు భయపడతారో.. వారు దేశం కోసం ఎలా పోరాడతారు?’’ అని అన్నారు. పార్లమెంటులో ఒక పార్టీకి మాట్లాడటానికి లభించే పరిమిత సమయాన్ని దేశాన్ని కాపాడటానికి ఉపయోగించుకోవాలి తప్ప. విమానాశ్రయాల్లో క్యాంటీన్లలో సమోసాల ధరను తగ్గించడం.’’ వంటి సమస్యలు కాదని వ్యంగ్యంగా అన్నారు.
‘‘పశ్చిమ బెంగాల్లో ఓటు హక్కును లాగేసుకుంటున్నారు. సభలో సీఈసీకి వ్యతిరేకంగా ఒక తీర్మానం వచ్చినప్పుడు భాయ్ సాహెబ్ దానిపై సంతకం
చేయడానికి నిరాకరించారు. పార్టీ సభ నుంచి వాకౌట్ చేసినప్పుడు మోడీకి హాజరును సూచించడానికి కూర్చునే ఉన్నారు. రాఘవ్.. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు భయపడుతున్నావు. దేశంలోని నిజమైన సమస్యలపై మాట్లాడటానికి భయపడుతున్నావు.’’ అని అన్నారు.
సౌరభ్ భరద్వాజ్..
పార్లమెంటులో ఉన్న పరిమిత సమయాన్ని తీవ్రమైన సమస్యలను లేవనెత్తడానికి ఉపయోగించుకోవాలి కదా? అని సౌరభ్ భరద్వాజ్ ప్రశ్నించారు. కానీ రాఘవ్ చద్దా ఆ పాత్రలో చురుకుగా పాల్గొంటున్నట్లు ఎక్కడా కనిపించడం లేదన్నారు. పార్టీ ఎంపీలు వాకౌట్ చేసినప్పుడు కూడా చద్దా సభలోనే ఉంటారని.. అది దేనికి సంకేతం అని అడిగారు.
Just saw ur video Raghav bhai.
I just want to say – “जो डर गया, समझो मर गया” pic.twitter.com/cgXN9cI4aG— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) April 3, 2026
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!