Gujarat: షాకైన విద్యార్థులు.. బోర్డు ఎగ్జామ్స్ లో వరల్డ్ కప్ ఫైనల్ గురించి ప్రశ్న…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: ప్రస్తుతం జరుతున్న గుజరాత్ రాష్ట్ర 10వ తరగతి బోర్డు పరీక్షల్లో వరల్డ్ కప్ ఫైనల్ – 2023 మ్యాచ్ గురించి ఓ ఆసక్తికర ప్రశ్న వచ్చింది. అహ్మదాబాద్ లో జరిగిన 2023 ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూశారా..? అయితే ఆ మ్యాచ్ ను మీ పరిశీలనను బట్టి మ్యాచ్ గురించి ఓ రిపోర్ట్ రాయండి.. అంటూ బోర్డు పరీక్ష ప్రశ్న పత్రంలో 4 మార్కులకు ప్రశ్న వచ్చింది. ఎన్నో అంచనాలతో ఈ సారి భారత జట్టు ఖచ్చితంగా విజయం సాధిస్తుందని సగటు భారత అభిమాని ఎంతో అనుకున్నప్పటికీ, ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో అపజయం పాలైంది. ఒక్క అపజయం లేకుండా ఫైనల్ వరకు వచ్చినా, చివరకు వరల్డ్ కప్ గెలవలేకపోయింది.
మొదటగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోవడంతో.. ఓపెనర్ రోహిత్ శర్మ ఎప్పటిలాగే తన దూకుడు ఇన్నింగ్స్ మొదలెట్టాడు. దీనితో కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 47 పరుగులు చేసి వెనుతిరిగాడు. ఇదే క్రమంలో శుబ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు కేవలం చెరో 4 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. ఆపై వెంటవెంటనే 3 వికెట్లు పడడంతో విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ అతి జాగ్రత్తగా ఆచితూచి ఆడారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: Minister Adimulapu Suresh: బీజేపీపై మంత్రి ఆదిమూలపు హాట్ కామెంట్లు..
ఇలా నెమ్మదిగా ఆడడంతో భారత జట్టు 50 ఓవర్లలో కేవలం 240 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆపై బ్యాటింగ్ మొదలు పెట్టిన డేవిడ్ వార్నర్ 7, మిచెల్ మార్ష్ 15, స్టీవ్ స్మిత్ 4 పరుగులు మాత్రమే జోడించి వెంటవెంటనే అవుట్ కావడంతో కేవలం 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది కంగారు టీం. ఈ పరిస్థితులలో టీం ఇండియా గెలవడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే, ఆస్ట్రేలియా బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ లు కలిసి నాలుగో వికెట్ కి ఏకంగా 192 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో, ఆస్ట్రేలియాకి ఘన విజయం లభించింది. ఆరవసారి వరల్డ్ కప్ని గెలుచుకుంది.
ఇక ఫైనల్ మ్యాచ్ పరంగా చూస్తే రోహిత్ శర్మ పేలవ కెప్టెన్సీ, బ్యాటింగ్ లో భారత బ్యాటర్ల అతి జాగ్రత్త, టెన్షన్.. ఇలా ప్రతి విషయం కలిసి టీమిండియాకి మరోసారి ఐసీసీ టోర్నీలో నిరాశనే మిగించింది. టీం ఇండియా భారతగడ్డపై ఆడుతున్న సమయంలో వారి ప్రేక్షకులను సైలెంట్ చేస్తా అని చెప్పిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ చెప్పినట్టే చేసాడు. అదేవిధంగా గడిచిన సంవత్సరం జూన్ లో భారత్ పై ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ను కూడా గెలిచిన ప్యాట్ కమ్మిన్స్, నవంబర్ మాసంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లోనూ భారత జట్టును మడత పెట్టాడు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?