Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Puri Jagannath Rath Yatra In Odisha And Cm Participated In Rituals

Puri Jagannatha Yatra: భక్త జనసంద్రమైన పూరీ… ఉగ్రముప్పు నేపథ్యంలో పటిష్ట భద్రత

Published Date :July 1, 2022 , 7:13 pm
By Mahesh Jakki
Puri Jagannatha Yatra: భక్త జనసంద్రమైన పూరీ… ఉగ్రముప్పు నేపథ్యంలో పటిష్ట భద్రత
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒడిశాలోని పూరీ పట్టణం భక్తులతో కిక్కిరిసిరపోయింది. పూరీలో జగన్నాథుడి రథయాత్ర కన్నులపండువగా కొనసాగుతోంది. కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా భక్తులు ఈ వేడుకలను తిలకించలేకపోయారు. గతంలో నిబంధనల మధ్య అతి కొద్ది మందితో జరిగింది. ఈసారి అంతా చూసేందుకు అవకాశం కల్పించడంతో గురువారం నుంచే పూరీ నగరం భక్త జనసంద్రాన్ని తలపించింది. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య జగన్నాథుడి రథం కదిలింది. నందిఘోష్‌ రథంలో జగన్నాథుడు, తాళధ్వజలో బలభద్రుడు, దర్పదళన్‌లో సుభద్రను ఊరేగిస్తారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జగన్నాథుడు, దేవీ సుభద్ర, బలభద్రుడు.. రథాలపై కొలువుదీరి భక్తులను ఆశీర్వదిస్తూ పూరీ వీధుల్లో ఊరేగుతున్నారు.

ఈసారి యాత్రకు 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రథయాత్ర నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే 205 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అన్ని ప్రాంతాల నుంచి మరో వెయ్యి బస్సులు నడుపుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. భారీగా భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. 185 ప్లాటూన్ల బలగాలను సిద్ధంగా ఉంచారు. 1000 మంది పోలీసు ఉన్నతాధికారులు రథయాత్రను సమీక్షిస్తున్నారు. అడుగడుగునా సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.

Also Read

  • India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
  • Producing States in India: భారత్‌లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
  • Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..

ఒడిశా గవర్నర్ గణేషి లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ పూరి జగన్నాథ యాత్రలో పాల్గొన్నారు. సీఎం నవీన్ పట్నాయక్ గవర్నర్, కేంద్ర మంత్రితో కలిసి జగన్నాథుని రథాన్ని లాగారు. ఈ సందర్భంగా జగన్నాథుడిని స్మరిస్తూ జయజయధ్వానాలు మారుమ్రోగాయి.

Read also: Puri Rath Yatra 2022: నేటి నుంచి పూరీ జగన్నాథ్ రథయాత్ర

 

ఏటా జూన్ లేదా జులైలోని శుక్లపక్షంలోని రెండోరోజు జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది. ఈ పనులు కొన్ని నెలల కిందటే ప్రారంభం అవుతాయి. సాధారణంగా ఏ ఆలయంలోనైనా, ఊరేగింపు కోసం ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మూలవిరాట్టును కదిలించరు. కానీ, పూరీలో మాత్రం ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకొచ్చి ఊరేగిస్తారు. అంతేకాదు.. ఇతర అన్ని ఆలయాల్లో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగిస్తారు. కానీ ఇక్కడ ప్రతిసారి కొత్త రథాలను నిర్మిస్తారు. ఆషాడ శుద్ధ విధియ రోజున ప్రారంభమయ్యే రథయాత్ర 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు కొనసాగుతుంది. ప్రతి ఏటా ఈ ఉత్సవం 12 రోజుల పాటు కొనసాగుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Naveen Patnaik
  • jagannath rath yatra
  • jagannath temple
  • Odisha
  • Puri

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions