NTV Telugu Site icon

Viral video: కేటుగాళ్ల నయా ప్లాన్.. రూ.5 లక్షల నగలతో పరారీ

Pune

Pune

వృద్ధ దంపతులు స్కూటీపై వెళ్తున్నారు. దారి మధ్యలో ఆకలి వేస్తోందని రోడ్డు పక్కన ఆపారు. భర్త వడాపావ్ తెచ్చేందుకు దుకాణంలోకి వెళ్లాడు. భార్య స్కూటీ దగ్గరే నిలబడింది. ఇద్దరు కంత్రీగాళ్లు ఆమె చుట్టే తిరుగుతున్నారు. కానీ ఆమె అది గమనించలేదు. ఒకడు ఆమె దృష్టిని మళ్లించగానే.. ఇంకొకడు స్కూటీపై ఉన్న నగల బ్యాగ్ తీసుకుని పరారయ్యాడు. పట్టుకునేందుకు ప్రయత్నించినా అప్పటికే మాయమయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 బ్యాట్స్‌మెన్స్

భార్యాభర్తలు బ్యాంకు నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఓ దుకాణం దగ్గర వడాపావ్‌ తినేందుకు ఆగారు. ఆ దంపతులు స్కూటర్‌ను రోడ్డు పక్కన నిలిపారు. పెద్దాయన ఫాస్ట్ ఫుడ్ కోసం షాపులోకి వెళ్లగా.. మహిళ స్కూటర్ దగ్గర వేచి ఉంది. కాసేపటి తర్వాత.. బైక్‌పై ముఖానికి మాస్క్‌తో ఒక వ్యక్తి స్కూటర్ దగ్గర ఆపాడు. రోడ్డుపై ఏదో పడిపోయినట్లుగా ఆ మహిళ దృష్టి మళ్లించి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దానికోసం వంగి వెతుకుతుండగా.. స్కూటర్‌ ముందు భాగంలో ఉన్న బ్యాగ్‌ను తీసుకుని మరో వ్యక్తి పరారయ్యాడు. దీన్ని గమనించిన మహిళ కేకలు వేస్తూ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వెనకే పరుగులు తీసింది. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆ కేటుగాడు తప్పించుకుని పారిపోయాడు.

ఇది కూడా చదవండి: Crime News: క్రైమ్ సినిమా చూసి భార్య హత్య.. శరీరాన్ని ముక్కలుగా కోసి పలుచోట్ల పడేసిన భర్త

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బ్యాగులో రూ. 5 లక్షల విలువైన ఆభరణాలు, సెల్‌ఫోన్లు కూడా అందులోనే ఉన్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.