Puducherry: పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం.. బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమిలో చిచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puducherry Political Crisis: పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కూటమిలో లుకలుకలు ఏర్పడ్డాయి. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సంకీర్ణంలో ఎన్ఆర్ కాంగ్రెస్, తమను పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రంగస్వామి వైఖరిని తప్పుపడుతున్నారు బీజేపీ నేతలు.
బార్ లైసెన్సులు వ్యవహారంలో, ప్రభుత్వం పదవుల విషయంలో ఇరు పార్టీల మధ్య ఇరు పార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. గత కొన్ని రోజులుగా ఇరు పార్టీల నేతలు విమర్శించుకుంటున్నారు. బార్ లైసెన్సుల విషయంలో సీఎం రంగస్వామి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు బీజేపీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. దీంతో హోంమంత్రి నమశివాయ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేల మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి పోటీగా ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీపై ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం చేపట్టేందుకు బీజేపీ ఆపరేషన్ చేస్తోందని ఎన్ఆర్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Also Read
- Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో ఒకే రన్వేపై రెండు విమానాలు.. వందలాది మంది ప్రయాణికులు చావు అంచుల వరకు..
- Beware Bachelors: పెళ్లి కావాల్సిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన వార్త! అందాల ఎర వేసి కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
- Ayodhya Ram Mandir: రామ మందిర్ ట్రస్ట్లో కలకలం.. చంపత్ రాయ్ వ్యాఖ్యలతో మళ్లీ వేడెక్కిన వివాదం
- CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
పుదుచ్చేరిలో ఇండిపెండెంట్ సభ్యలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. పుదుచ్చేరిలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 33. ఇందులో ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ 10 స్థానాలు గెలవగా.. బీజేపీ 6, ఇండిపెండెంట్లు 6 స్థానాల్లో గెలుపొందారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు చెరో రెండు స్థానాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం మంత్రి వర్గంలో సీఎం రంగస్వామితో పాటు మరో ముగ్గురు ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన వారు ఉన్నారు. బీజేపీ నుంచి శరవణ కుమార్, నమశ్శివాయ ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. స్పీకర్ గా బీజేపీ నుంచి ఆర్ సెల్వన్ ఉండగా..డిప్యూటీ స్పీకర్ గా ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి రాజు వేలు ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి.. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ లోని అసంతృప్తుల్ని కూడా తమవైపు తిప్పుకునేలా బీజేపీ పావులు కదుపుతోంది.
తాజావార్తలు
-
R Madhavan: అందమైన హీరోయిన్ల మధ్య ఉన్నా భార్యను ఎందుకు మోసం చేయలేదో చెప్పిన స్టార్ యాక్టర్!
-
OG 2 Update : పవర్ స్టార్ ‘OG -2’ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్కు డేట్ ఫిక్స్
-
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో ఒకే రన్వేపై రెండు విమానాలు.. వందలాది మంది ప్రయాణికులు చావు అంచుల వరకు..
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Beware Bachelors: పెళ్లి కావాల్సిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన వార్త! అందాల ఎర వేసి కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!