Priyanka Gandhi: రైతులకు బీజేపీ మంత్రి ధమ్కీ … లఖీంపూర్ ఖేరీ ఘటనపై ప్రియాంకా ట్వీట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా ఢిల్లీలో ఏడాది పాటు రైతులు ఉద్యమం చేశారు. చివరకు రైతులు ఉద్యమానికి దిగివచ్చి ప్రధాని నరేంద్రమోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇదిలా ఉంటే రైతుల ఉద్యమంలో భాగంగా యూపీలో లఖీంపూర్ ఖేరీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపైకి వేగంగా కార్లు నడిపించడంతో 8 మంది మరణించారు. ఇందులో నలుగురు రైతులు ఉండటంతో దేశవ్యాప్తంగా కేంద్రమంత్రిపై, బీజేపీ పార్టీపై విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ తీరుపై, లఖీంపూర్ ఖేరీ ఘటనపై తీవ్ర విమర్శలు చేస్తోంది.
లఖీంపూర్ ఖేరీ ఘటనకు ముందు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రైతులను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులు తమ ఆందోళనను విరమించకుంటే ‘ రైతులను రెండు నిమిషాల్లో సరిచేస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై అలహాబాద్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ వ్యక్తులు, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు హోదాకు తగ్గట్లు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని… కేంద్ర మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోతే లఖీంపూర్ ఖేరీ సంఘటన జరిగేది కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్ట్. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులకు బెయిల్ తిరస్కరిస్తూ హైకోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది.
Also Read
తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ మరోసారి ట్వీట్ చేశారు. లఖీంపూర్ ఖేరీ సంఘటనలో ముఖ్యమైన అంశం ఏమిటంటే… కేంద్రమంత్రి రైతులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేయడం అని… బీజేపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవదని మంత్రి వ్యాఖ్యలు బలపరిచాయని.. లఖీంపూర్ ఖేరీ ఘటనపై న్యాయపోరాటం కొనసాగుతుందని..బాధిత రైతు కుటుంబం కోసం అందరం కలిసి న్యాయపోరాటం చేయాల్సిందే అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో లఖీంపూర్ ఖేరీ ఘటన బీజేపీపై ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు భావించినప్పటికీ ఆ ప్రాంత ప్రజల మద్దతు బీజేపీ లభించడం కొసమెరుపు. ఆ జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాలను బీజేపీ పార్టీ దక్కించుకుంది. ఇంతలా దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయిన ప్రాంతంలో బీజేపీపై వ్యతిరేఖత కనిపించలేదు.
लखीमपुर किसान नरसंहार में सबसे अहम पहलू था गृह राज्यमंत्री का "किसानों को देख लेने" की धमकी वाला भाषण।
भाजपा सरकार ने किसानों के पक्ष में खड़े होने की बजाय, अपने मंत्री की लाठी मजबूत की।
न्याय का संघर्ष जारी है
पीड़ित किसान परिवार व हम सब मिलकर न्याय की लौ बुझने नहीं देंगे। pic.twitter.com/K5kYBq5LKa
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 10, 2022
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
-
RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
-
Kitchen Hygiene: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు!
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!