Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Priyanka Gandhi Allahabad High Court On Lakhimpur Kheri Incident Priyanka Gandhi Twitt

Priyanka Gandhi: రైతులకు బీజేపీ మంత్రి ధమ్కీ … లఖీంపూర్ ఖేరీ ఘటనపై ప్రియాంకా ట్వీట్…

Published Date :May 10, 2022 , 10:20 am
By Venu Goapl Reddy
Priyanka Gandhi: రైతులకు బీజేపీ మంత్రి ధమ్కీ … లఖీంపూర్ ఖేరీ ఘటనపై ప్రియాంకా ట్వీట్…
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశవ్యాప్తంగా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా ఢిల్లీలో ఏడాది పాటు రైతులు ఉద్యమం చేశారు. చివరకు రైతులు ఉద్యమానికి దిగివచ్చి ప్రధాని నరేంద్రమోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇదిలా ఉంటే రైతుల ఉద్యమంలో భాగంగా యూపీలో లఖీంపూర్ ఖేరీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపైకి వేగంగా కార్లు నడిపించడంతో 8 మంది మరణించారు. ఇందులో నలుగురు రైతులు ఉండటంతో దేశవ్యాప్తంగా కేంద్రమంత్రిపై, బీజేపీ పార్టీపై విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ తీరుపై, లఖీంపూర్ ఖేరీ ఘటనపై తీవ్ర విమర్శలు చేస్తోంది.

లఖీంపూర్ ఖేరీ ఘటనకు ముందు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రైతులను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులు తమ ఆందోళనను విరమించకుంటే ‘ రైతులను రెండు నిమిషాల్లో సరిచేస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై అలహాబాద్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ వ్యక్తులు, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు హోదాకు తగ్గట్లు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని… కేంద్ర మంత్రి  ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోతే లఖీంపూర్ ఖేరీ సంఘటన జరిగేది కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది  అలహాబాద్ హైకోర్ట్. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులకు బెయిల్ తిరస్కరిస్తూ హైకోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది.

Also Read

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..
  • FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
  • PM Modi: మే 4 తర్వాత బెంగాల్‌లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
  • Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం

తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ మరోసారి ట్వీట్ చేశారు. లఖీంపూర్ ఖేరీ సంఘటనలో ముఖ్యమైన అంశం ఏమిటంటే… కేంద్రమంత్రి రైతులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేయడం అని… బీజేపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవదని మంత్రి వ్యాఖ్యలు బలపరిచాయని.. లఖీంపూర్ ఖేరీ ఘటనపై న్యాయపోరాటం కొనసాగుతుందని..బాధిత రైతు కుటుంబం కోసం అందరం కలిసి న్యాయపోరాటం చేయాల్సిందే అంటూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో లఖీంపూర్ ఖేరీ ఘటన బీజేపీపై ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు భావించినప్పటికీ ఆ ప్రాంత ప్రజల మద్దతు బీజేపీ లభించడం కొసమెరుపు. ఆ జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాలను బీజేపీ పార్టీ దక్కించుకుంది. ఇంతలా దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయిన ప్రాంతంలో బీజేపీపై వ్యతిరేఖత కనిపించలేదు.

लखीमपुर किसान नरसंहार में सबसे अहम पहलू था गृह राज्यमंत्री का "किसानों को देख लेने" की धमकी वाला भाषण।

भाजपा सरकार ने किसानों के पक्ष में खड़े होने की बजाय, अपने मंत्री की लाठी मजबूत की।

न्याय का संघर्ष जारी है

पीड़ित किसान परिवार व हम सब मिलकर न्याय की लौ बुझने नहीं देंगे। pic.twitter.com/K5kYBq5LKa

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 10, 2022

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 3 farm laws
  • Ajay Mishra
  • Congress General Secretary Priyanka Gandhi
  • Lakhimpur Kheri

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions