Priyanka Gandhi: రైతులకు బీజేపీ మంత్రి ధమ్కీ … లఖీంపూర్ ఖేరీ ఘటనపై ప్రియాంకా ట్వీట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా ఢిల్లీలో ఏడాది పాటు రైతులు ఉద్యమం చేశారు. చివరకు రైతులు ఉద్యమానికి దిగివచ్చి ప్రధాని నరేంద్రమోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇదిలా ఉంటే రైతుల ఉద్యమంలో భాగంగా యూపీలో లఖీంపూర్ ఖేరీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపైకి వేగంగా కార్లు నడిపించడంతో 8 మంది మరణించారు. ఇందులో నలుగురు రైతులు ఉండటంతో దేశవ్యాప్తంగా కేంద్రమంత్రిపై, బీజేపీ పార్టీపై విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ తీరుపై, లఖీంపూర్ ఖేరీ ఘటనపై తీవ్ర విమర్శలు చేస్తోంది.
లఖీంపూర్ ఖేరీ ఘటనకు ముందు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రైతులను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులు తమ ఆందోళనను విరమించకుంటే ‘ రైతులను రెండు నిమిషాల్లో సరిచేస్తా’ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై అలహాబాద్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ వ్యక్తులు, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు హోదాకు తగ్గట్లు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని… కేంద్ర మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోతే లఖీంపూర్ ఖేరీ సంఘటన జరిగేది కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్ట్. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులకు బెయిల్ తిరస్కరిస్తూ హైకోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది.
Also Read
- Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
- Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
- Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
- Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ మరోసారి ట్వీట్ చేశారు. లఖీంపూర్ ఖేరీ సంఘటనలో ముఖ్యమైన అంశం ఏమిటంటే… కేంద్రమంత్రి రైతులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేయడం అని… బీజేపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవదని మంత్రి వ్యాఖ్యలు బలపరిచాయని.. లఖీంపూర్ ఖేరీ ఘటనపై న్యాయపోరాటం కొనసాగుతుందని..బాధిత రైతు కుటుంబం కోసం అందరం కలిసి న్యాయపోరాటం చేయాల్సిందే అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో లఖీంపూర్ ఖేరీ ఘటన బీజేపీపై ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు భావించినప్పటికీ ఆ ప్రాంత ప్రజల మద్దతు బీజేపీ లభించడం కొసమెరుపు. ఆ జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాలను బీజేపీ పార్టీ దక్కించుకుంది. ఇంతలా దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయిన ప్రాంతంలో బీజేపీపై వ్యతిరేఖత కనిపించలేదు.
लखीमपुर किसान नरसंहार में सबसे अहम पहलू था गृह राज्यमंत्री का "किसानों को देख लेने" की धमकी वाला भाषण।
भाजपा सरकार ने किसानों के पक्ष में खड़े होने की बजाय, अपने मंत्री की लाठी मजबूत की।
न्याय का संघर्ष जारी है
पीड़ित किसान परिवार व हम सब मिलकर न्याय की लौ बुझने नहीं देंगे। pic.twitter.com/K5kYBq5LKa
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 10, 2022
తాజావార్తలు
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
-
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
-
ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
-
Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!