Prashant Kishor: జేడీయూకు ప్రశాంత్ కిషోర్ సవాల్.. 25 కంటే ఎక్కువ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తానని శపథం
- జేడీయూకు ప్రశాంత్ కిషోర్ సవాల్
- 25 కంటే ఎక్కువ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తానని శపథం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో ఎన్నికల వార్ నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నేతలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. ఇక నవంబర్ కల్లా బీహార్ ఎన్నికలు ముగించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది.
ఇది కూడా చదవండి: Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటేసిన సోనియా, ప్రియాంక
Also Read
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
ఇదిలా ఉంటే ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ జేడీయూకు సంచలన సవాల్ విసిరారు. ఈసారి నితీష్కుమార్ పార్టీ 25 సీట్ల కంటే ఎక్కువ గెలవదని తేల్చి చెప్పారు. ఒకవేళ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తానని ప్రకటించారు. కిషన్గంజ్ జిల్లాలో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ఈ శపథం చేశారు.
ఇది కూడా చదవండి: Warangal: ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఇల్లాలు కుట్ర.. బాధితుడు ఎలా బయటపడ్డాడంటే..!
2021లో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 100 కంటే ఎక్కువ గెలవదని చెప్పానని.. తీరా ఆ ఎన్నికల్లో 77 సీట్లకే పరిమితమైందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా బీహార్లో జేడీయూ 25 కంటే ఎక్కువగా ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. ఒకవేళ గెలిస్తే.. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు.
దేశంలో 80 శాతం మంది హిందువులు ఉన్నారని.. అందులో బీజేపీకి 40 శాతమే మద్దతు ఇస్తారని.. అంటే సగం మంది బీజేపీకి ఓటు వేయరన్నారు. గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, కమ్యూనిజం, సోషలిజాన్ని అనుసరించే హిందువులెవరూ బీజేపీకి ఓటు వేయరని తెలిపారు. అందుకోసం ఈ 40 శాతం ఉన్న హిందువులు.. 20 శాతం ఉన్న ముస్లింలతో చేతులు కలిపితే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఎంఐఎం ఒంటరిగా పోరాటం చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదని.. అధికార పార్టీని ఓడించడానికి సైద్ధాంతికంగా ప్రేరేపించబడిన హిందువులతో కలిసి పోరాడాలని ఒవైసీని కోరారు. ఒవైసీ తనకు స్నేహితుడని.. ఆయన బీజేపీపై ఒంటరిగా పోరాడాలని కోరుకుంటున్నారని.. అలా కాకుండా సైద్ధాంతిక హిందువులతో కలిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఓడించడానికి మహాత్మాగాంధీ సిద్ధాంతమే ఏకైక మార్గం అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..