CV Ananda: పోలీసులపై బెంగాల్ గవర్నర్ తీవ్ర విమర్శలు.. నేరస్థులున్నారని వ్యాఖ్య
- పోలీసులపై బెంగాల్ గవర్నర్ తీవ్ర విమర్శలు
- నేరస్థులున్నారని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ.ఆనంద్.. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల్లో కొంత మంది నేరాల్లో భాగమయ్యారని, అవినీతికి పాల్పడుతున్నారని, రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత బెంగాల్ పోలీసులు తమతో బేరసారాలకు పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇది కూడా చదవండి: UP: యోగి సర్కార్ తీరుపై ములాయం కోడలు అపర్ణ అలక.. ఎస్పీలో చేరేందుకు ఏర్పాట్లు!
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
గవర్నర్ బోస్ మీడియాతో మాట్లాడారు.. బాధితురాలి తల్లిదండ్రులు తనతో కొన్ని విషయాలు చెప్పారని.. అవి చాలా హృదయ విదారకంగా ఉన్నాయని తెలిపారు. వారు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. రెండు రోజుల్లో చర్యలు ఉంటాయన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు సహా సమాజమంతా న్యాయం కోరుతోందని వెల్లడించారు. చట్టం ఉన్నప్పటికీ.. అది సక్రమంగా అమలు కావడం లేదన్నారు. పోలీసు వ్యవస్థలో కొంతమంది భ్రష్టుపట్టిపోయారని గవర్నర్ ఆనంద బోస్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: France: ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్ ఎన్నిక
వైద్యురాలి కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు యత్నించారని, హడావుడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని ఆరోపించారు. ఈ కేసుపై తొలుత కోల్కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే వారు వ్యవహరించిన తీరుపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో కేసును కోల్కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు సాగుతోంది. ఇక ఆర్జీ కర్ ఆస్పత్రిలోని ఆర్థిక అవకతవకలపై మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను సీబీఐ కస్టడీకి హైకోర్టు అప్పగించింది.
ఇది కూడా చదవండి: SBI Donations: సీఎం సహాయనిధికి ఎస్బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం విరాళం
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!