PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PMAY House Size Rules: దేశంలోని పేద కుటుంబాలకు శాశ్వత గృహాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం PMAY 2.0 అమలును కూడా ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించేందుకు రూ.1.20 లక్షలు, కొండ ప్రాంతాల్లో రూ.1.30 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో కేంద్రం నుంచి రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇలా..
గ్రామీణ ప్రాంతాల్లో అందించే రూ.1.20 లక్షలలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా భరిస్తాయి. అదనంగా మనరేగా కింద గృహ నిర్మాణ పనులకు వేతనాలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12,000 వరకు అందజేస్తారు. దీంతో గ్రామీణ పేద కుటుంబాలకు మొత్తం ప్రయోజనం సుమారు రూ.1.50 లక్షల వరకు చేరుతుంది.
Also Read
- Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
పట్టణ ప్రాంతాల్లో ఇలా..
పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల స్థిర సహాయం అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ఆర్థిక సహాయం ప్రకటిస్తాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.1 లక్ష జోడించి మొత్తం సహాయాన్ని రూ.2.50 లక్షలకు పెంచగా, బీహార్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేల అదనపు సాయం అందిస్తోంది.
ఇంటి కనీస విస్తీర్ణం ఎంత ఉండాలి..?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం PMAY-G కింద నిర్మించే ఇంటి కనీస విస్తీర్ణం 25 చదరపు మీటర్లు (సుమారు 269 చదరపు అడుగులు) ఉండాలి. ఈ పరిమాణం ఉన్న ఇంటికే ప్రభుత్వ సహాయం వర్తిస్తుంది. అంతకంటే పెద్ద ఇల్లు నిర్మించాలనుకుంటే లబ్ధిదారులు తమ సొంత నిధులతో అదనపు నిర్మాణం చేపట్టవచ్చు.
ఎన్ని గదులు ఉండాలి..?
ప్రామాణిక నమూనాల ప్రకారం ఇంటిలో కనీసం ఒక గది, వంటగది లేదా వంట స్థలం ఉండాలి. అవసరాన్ని బట్టి వరండా లేదా రెండు చిన్న గదులుగా నిర్మించుకునే అవకాశం కూడా ఉంది. అయితే టాయిలెట్ను ప్రధాన ఇంటి విస్తీర్ణంలో చేర్చరు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద అందే నిధులతో ఇంటికి ఆనుకుని లేదా కొద్దిదూరంలో ప్రత్యేకంగా మరుగుదొడ్డి నిర్మించుకోవాలి. అంటే.. ప్రభుత్వం సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించే ఈ ఇళ్లు అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా శాశ్వతంగా ఉండే విధంగా రూపకల్పన చేయబడతాయి. దీంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు సురక్షితమైన, శాశ్వత నివాసాన్ని సొంతం చేసుకునే అవకాశం కలుగుతోంది.
తాజావార్తలు
-
Top 5 Expensive Phones: భారత్లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!