PM Modi: రేపు బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో ప్రధాని మోదీ రేపు బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన్నారు. దీనితో యూపీలో ఆరవ ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి రాబోతోంది. ఫిబ్రవరి 29, 2020న బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. 28 నెలల్లోనే ఎక్స్ప్రెస్వే పనులు పూర్తి కాగా.. ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ ఎక్స్ప్రెస్వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో దాదాపు రూ. 14,850 కోట్ల వ్యయంతో 296 కి.మీ నాలుగు లేన్లతో ఎక్స్ప్రెస్ వే నిర్మించబడింది. దీనిని ఆరు లేన్ల వరకు కూడా విస్తరించవచ్చు. ఈ ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టుతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని.. నగరాలలో ఉండే సౌకర్యాలు సామాన్య ప్రజానీకానికి సైతం అందుబాటులోకి వస్తాయని పీఎంవో వెల్లడించింది.
ఈ ప్రాజెక్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థ, కనెక్టివిటీని పెంచుతుందని ప్రధాని మోదీ శుక్రవారం అన్నారు. శనివారం బుందేల్ఖండ్ ప్రాంతంలోని సోదరీమణులు, సోదరులకు ప్రత్యేకమైన రోజని.. జలౌన్ జిల్లాలో ఒక కార్యక్రమంలో, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే ప్రారంభించబడుతుందని.. ఈ ప్రాజెక్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థ, కనెక్టివిటీని పెంచుతుందని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ శనివారం జలౌన్ జిల్లా ఒరై తహసీల్లోని కైతేరి గ్రామంలో బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించనున్నారు.
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
Viral Video: మాజీ సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం.. డబ్బులు విసిరికొట్టిన మహిళ
ఇది చిత్రకూట్ జిల్లాలోని భరత్కూప్ సమీపంలోని గోండా గ్రామం వద్ద ఎన్హెచ్-35 నుంచి ఎటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామం వరకు విస్తరించి ఉంది, చిత్రకూట్-ఇటావా మధ్య నిర్మించిన ఈ ఎక్స్ప్రెస్వే నిర్దేశిత గడువు కంటే 8 నెలల ముందే పూర్తయింది. ఇక్కడ అది ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేతో కలిసిపోతుంది. ఇది చిత్రకూట్, బందా, మహోబా, హమీర్పూర్, జలౌన్, ఔరైయా మరియు ఇటావాతో సహా ఏడు జిల్లాల గుండా వెళుతుంది. దీనికి 13 ఇంటర్ఛేంజ్ పాయింట్లు ఉన్నాయి. అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.15,000 కోట్లు. అయితే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇ-టెండరింగ్ను ఎంచుకోవడం ద్వారా రూ.1,132 కోట్లు ఆదా చేసింది. బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే నిర్మించడం ద్వారా ఢిల్లీ-చిత్రకూట్ మధ్య ప్రయాణ సమయం 6 గంటలకు తగ్గుతుంది.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..