PM speaks to Trump: ట్రంప్‌కు ప్రధాని మోడీ ఫోన్.. వీటిపైనే చర్చ..

  • ట్రంప్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ..
  • సుంకాల నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన సంభాషణ..
  • వాణిజ్యం, ఎనర్జీ, డిఫెన్స్ అంశాలపై చర్చ..
  • కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న నేతలు..
Pm Speaks To Trump

Pm Speaks To Trump

PM speaks to Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేశారు. యూఎస్ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. మోడీ, ట్రంప్‌లు రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడం, ఎనర్జీ, డిఫెన్స్ రంగాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: Pak Boat Seize: భారత జలాల్లోకి వచ్చిన పాక్ పడవ స్వాధీనం.. 11 మంది అరెస్ట్..

వాణిజ్యం, కీలక సాంకేతికతలు, ఇంధనం, రక్షణ మరియు భద్రతలో సహకారాన్ని విస్తరించడంపై నాయకులు అభిప్రాయాలను పంచుకుంటారు. ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి, ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇద్దరు నాయకులు కలిసి పనిచేయాలని అంగీకరించారు. భారతదేశం-యుఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని ఇద్దరు నాయకులు సమీక్షించారు. అన్ని రంగాలలో ద్వైపాక్షిక సహకారం స్థిరంగా బలోపేతం కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వీటితో పాటు వివిధ ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలను గురించి చర్చించారు.

ట్రంప్‌తో మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోడీ ఎక్స్‌లో వెల్లడించారు. ‘‘అధ్యక్షుడు ట్రంప్ తో చాలా హృదయపూర్వకమైన, ఆకర్షణీయమైన సంభాషణ జరిగింది. మా ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని మేము సమీక్షించాము. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలను చర్చించాము. ప్రపంచ శాంతి, స్థిరత్వం , శ్రేయస్సు కోసం భారతదేశం మరియు అమెరికా కలిసి పనిచేయడం కొనసాగిస్తాయి’’ అని ట్వీట్ చేశారు.