PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- రేపు దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాని మోడీ
- కర్ణాటక, తెలంగాణలో మోడీ పర్యటన
- హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఆదివారం దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు వస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో మోడీ పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బీజేపీ సభలో ప్రసంగించనున్నారు.
ఉదయం 11 గంటలకు కర్ణాటకలో నిర్వహించనున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. సమాజ సేవ లక్ష్యంగా వివిధ రంగాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని మోడీ పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా సుమారు రూ.9500 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. రహదారులు, లాజిస్టిక్స్, వస్త్ర పరిశ్రమ, రైల్వేలు, ఇంధన రంగం తదితర విభాగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. అలాగే సింధు ఆస్పత్రిని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Also Read
హైదరాబాద్ టూర్ నేపథ్యంలో మోడీ కీలక ట్వీట్ చేశారు. ‘‘గతంలో బీఆర్ఎస్ దుష్పరిపాలన.. ఇప్పుడు కాంగ్రెస్ దుష్పరిపాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. మాకు పెరుగుతున్న మద్దతును బట్టి చూస్తే.. తెలంగాణ ప్రజల మొదటి ఎంపిక మా పార్టీయే.’’ అని మోడీ పేర్కొన్నారు.
Tomorrow, 10th May, I will be attending various programmes in Karnataka and Telangana.
At 11 AM tomorrow, I will join the programme to mark the 45th anniversary celebrations of the establishment of the Art of Living. In line with our ethos of serving society, they have been…
— Narendra Modi (@narendramodi) May 9, 2026
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?