Punjab Elections: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. కాంగ్రెస్కు జిరాక్స్ ఆమ్ ఆద్మీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది… దీంతో.. రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి అన్ని పార్టీలు.. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, అమరీందర్సింగ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రంగంలోకి దిగారు.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను టార్గెట్ చేస్తే విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. పఠాన్ కోట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ.. పంజాబ్ ప్రజల కోసం పనిచేసే అవకాశం బీజేపీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. ఒక్క ఐదేళ్లు ఛాన్స్ ఇచ్చి చూడండి.. పంజాబ్ రూపు రేఖలు మొత్తం మార్చివేస్తామని ప్రకటించారు ప్రధాని మోడీ.. ఇక, కాంగ్రెస్ ఒరిజినల్ అయితే ఆమ్ఆద్మీ పార్టీ దాని జిరాక్స్ అంటూ ఆరోపణలు గుప్పించిన ఆయన.. ఒకరు పంజాబ్ను లూటీ చేస్తే.. మరొకరు ఢిల్లీలో స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. పంజాబ్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో వ్యవసాయం, వాణిజ్యం మరియు పరిశ్రమలు లాభసాటిగా మారుతాయని అన్నారు. ఫిబ్రవరి 20న పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. మీకు సేవ చేయడానికి నాకు ఐదేళ్లు సమయం ఇవ్వండి అని కోరారు ప్రధాని.
ఇక, రవిదాస్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ రోజు కరోల్ బాగ్లోని ‘శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్’లో ప్రార్థనలు చేశారు. మార్మిక కవికి దేశవ్యాప్త ఫాలోయింగ్ ఉంది, ముఖ్యంగా దళితులలో. గురు రవిదాస్ జయంతి అనేది పంజాబ్లోని దళితులలో ప్రసిద్ధి చెందిన పండుగ, ఇది రాష్ట్ర జనాభాలో 30 శాతం కంటే ఎక్కువ. గౌరవనీయమైన తత్వవేత్త ఆలయాన్ని సందర్శించడంపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. రవిదాస్ 15వ మరియు 16వ శతాబ్దాలలో భక్తి ఉద్యమానికి చెందినవాడు మరియు అతని శ్లోకాలు గురు గ్రంథ్ సాహిబ్లో చేర్చబడ్డాయి. అతను 21వ శతాబ్దపు రవిదాస్సియా మత స్థాపకుడిగా పరిగణించబడ్డాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసం పౌర్ణమి రోజు అయిన మాఘ పూర్ణిమ నాడు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు. గురు రవిదాస్ జయంతి దృష్ట్యా ఎన్నికల సంఘం పంజాబ్ ఎన్నికలను ఫిబ్రవరి 14న ఫిబ్రవరి 20కి ఒక వారం వాయిదా వేసిన విషయం తెలిసిందే..
Also Read
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
- Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
తాజావార్తలు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. 716.907 బిలియన్ డాలర్లకు చేరిక, భారీగా పెరిగిన బంగారం నిల్వలు
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!