Punjab Elections: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. కాంగ్రెస్కు జిరాక్స్ ఆమ్ ఆద్మీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది… దీంతో.. రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి అన్ని పార్టీలు.. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, అమరీందర్సింగ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రంగంలోకి దిగారు.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను టార్గెట్ చేస్తే విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. పఠాన్ కోట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ.. పంజాబ్ ప్రజల కోసం పనిచేసే అవకాశం బీజేపీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. ఒక్క ఐదేళ్లు ఛాన్స్ ఇచ్చి చూడండి.. పంజాబ్ రూపు రేఖలు మొత్తం మార్చివేస్తామని ప్రకటించారు ప్రధాని మోడీ.. ఇక, కాంగ్రెస్ ఒరిజినల్ అయితే ఆమ్ఆద్మీ పార్టీ దాని జిరాక్స్ అంటూ ఆరోపణలు గుప్పించిన ఆయన.. ఒకరు పంజాబ్ను లూటీ చేస్తే.. మరొకరు ఢిల్లీలో స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. పంజాబ్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో వ్యవసాయం, వాణిజ్యం మరియు పరిశ్రమలు లాభసాటిగా మారుతాయని అన్నారు. ఫిబ్రవరి 20న పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. మీకు సేవ చేయడానికి నాకు ఐదేళ్లు సమయం ఇవ్వండి అని కోరారు ప్రధాని.
ఇక, రవిదాస్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ రోజు కరోల్ బాగ్లోని ‘శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్’లో ప్రార్థనలు చేశారు. మార్మిక కవికి దేశవ్యాప్త ఫాలోయింగ్ ఉంది, ముఖ్యంగా దళితులలో. గురు రవిదాస్ జయంతి అనేది పంజాబ్లోని దళితులలో ప్రసిద్ధి చెందిన పండుగ, ఇది రాష్ట్ర జనాభాలో 30 శాతం కంటే ఎక్కువ. గౌరవనీయమైన తత్వవేత్త ఆలయాన్ని సందర్శించడంపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. రవిదాస్ 15వ మరియు 16వ శతాబ్దాలలో భక్తి ఉద్యమానికి చెందినవాడు మరియు అతని శ్లోకాలు గురు గ్రంథ్ సాహిబ్లో చేర్చబడ్డాయి. అతను 21వ శతాబ్దపు రవిదాస్సియా మత స్థాపకుడిగా పరిగణించబడ్డాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసం పౌర్ణమి రోజు అయిన మాఘ పూర్ణిమ నాడు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు. గురు రవిదాస్ జయంతి దృష్ట్యా ఎన్నికల సంఘం పంజాబ్ ఎన్నికలను ఫిబ్రవరి 14న ఫిబ్రవరి 20కి ఒక వారం వాయిదా వేసిన విషయం తెలిసిందే..
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!