Punjab Elections: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. కాంగ్రెస్కు జిరాక్స్ ఆమ్ ఆద్మీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది… దీంతో.. రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి అన్ని పార్టీలు.. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, అమరీందర్సింగ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రంగంలోకి దిగారు.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను టార్గెట్ చేస్తే విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. పఠాన్ కోట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ.. పంజాబ్ ప్రజల కోసం పనిచేసే అవకాశం బీజేపీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. ఒక్క ఐదేళ్లు ఛాన్స్ ఇచ్చి చూడండి.. పంజాబ్ రూపు రేఖలు మొత్తం మార్చివేస్తామని ప్రకటించారు ప్రధాని మోడీ.. ఇక, కాంగ్రెస్ ఒరిజినల్ అయితే ఆమ్ఆద్మీ పార్టీ దాని జిరాక్స్ అంటూ ఆరోపణలు గుప్పించిన ఆయన.. ఒకరు పంజాబ్ను లూటీ చేస్తే.. మరొకరు ఢిల్లీలో స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. పంజాబ్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో వ్యవసాయం, వాణిజ్యం మరియు పరిశ్రమలు లాభసాటిగా మారుతాయని అన్నారు. ఫిబ్రవరి 20న పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. మీకు సేవ చేయడానికి నాకు ఐదేళ్లు సమయం ఇవ్వండి అని కోరారు ప్రధాని.
ఇక, రవిదాస్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ రోజు కరోల్ బాగ్లోని ‘శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్’లో ప్రార్థనలు చేశారు. మార్మిక కవికి దేశవ్యాప్త ఫాలోయింగ్ ఉంది, ముఖ్యంగా దళితులలో. గురు రవిదాస్ జయంతి అనేది పంజాబ్లోని దళితులలో ప్రసిద్ధి చెందిన పండుగ, ఇది రాష్ట్ర జనాభాలో 30 శాతం కంటే ఎక్కువ. గౌరవనీయమైన తత్వవేత్త ఆలయాన్ని సందర్శించడంపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. రవిదాస్ 15వ మరియు 16వ శతాబ్దాలలో భక్తి ఉద్యమానికి చెందినవాడు మరియు అతని శ్లోకాలు గురు గ్రంథ్ సాహిబ్లో చేర్చబడ్డాయి. అతను 21వ శతాబ్దపు రవిదాస్సియా మత స్థాపకుడిగా పరిగణించబడ్డాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసం పౌర్ణమి రోజు అయిన మాఘ పూర్ణిమ నాడు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు. గురు రవిదాస్ జయంతి దృష్ట్యా ఎన్నికల సంఘం పంజాబ్ ఎన్నికలను ఫిబ్రవరి 14న ఫిబ్రవరి 20కి ఒక వారం వాయిదా వేసిన విషయం తెలిసిందే..
Also Read
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
తాజావార్తలు
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
-
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
-
Avatar 3: ఫైనల్గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!