PM Modi: పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి
- పహల్గామ్ ఉగ్ర దాడి జరిగి నేటితో ఏడాది పూర్తి
- పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి
- ఉగ్రవాదాన్ని సహించబోమని ప్రధాని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి జరిగి నేటితో ఏడాది పూర్తైంది. కుటుంబాలతో పహల్గామ్లో విహరిస్తుండగా హఠాత్తుగా ఉగ్ర మూకలు విరుచుకుపడి మతం పేరుతో 26 మంది పురుషులను పొట్టనపెట్టుకున్నారు. ఏడాది నుంచి 26 కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ పహల్గామ్ బాధితులను స్మరించుకున్నారు. బాధితులకు నివాళి అర్పించారు. గతేడాది ఇదే రోజున పహల్గామ్ ఉగ్ర దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. వారిని ఎప్పటికీ మరిచిపోలేమని.. నష్టపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా పేర్కొన్నారు. దుఃఖంలోనూ.. సంకల్పంలోనూ ఒక దేశంగా ఐక్యంగా ఉన్నామన్నారు. భారతదేశం ఏ విధమైన ఉగ్రవాదానికి తలొగ్గదని.. ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావన్నారు.
Also Read
ఇది కూడా చదవండి: Trump: చర్చలకు ఇరాన్ నిరాకరణ.. చేసేదేమీలేక కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్.. అంతర్జాతీయంగా తీవ్ర చర్చ
గతేడాది ఇదే రోజున హిందువులను టార్గెట్గా చేసుకుని 26 మంది పురుషులను ఉగ్రవాదులు చంపేశారు. భార్య, పిల్లల ముందే చంపేశారు. కొత్తగా పెళ్లైన జంటలను కూడా వదిలిపెట్టకుండా నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. ఈ ఘటన యావత్తు దేశంతో పాటు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది. ఈ పరిణామాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మే 7న పాకిస్థాన్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. మొత్తానికి నాలుగు రోజుల యుద్ధం తర్వాత పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. అనంతరం పహల్గామ్లో కాల్పులకు తెగబడ్డ ముష్కరులను కూడా భద్రతా దళాలు అంతమొందించాయి.
Remembering the innocent lives lost in the gruesome Pahalgam terror attack on this day last year. They will never be forgotten. My thoughts are also with the bereaved families as they cope with this loss.
As a nation, we stand united in grief and resolve. India will never bow to…
— Narendra Modi (@narendramodi) April 22, 2026
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!