PM Modi: పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి
- పహల్గామ్ ఉగ్ర దాడి జరిగి నేటితో ఏడాది పూర్తి
- పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి
- ఉగ్రవాదాన్ని సహించబోమని ప్రధాని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి జరిగి నేటితో ఏడాది పూర్తైంది. కుటుంబాలతో పహల్గామ్లో విహరిస్తుండగా హఠాత్తుగా ఉగ్ర మూకలు విరుచుకుపడి మతం పేరుతో 26 మంది పురుషులను పొట్టనపెట్టుకున్నారు. ఏడాది నుంచి 26 కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ పహల్గామ్ బాధితులను స్మరించుకున్నారు. బాధితులకు నివాళి అర్పించారు. గతేడాది ఇదే రోజున పహల్గామ్ ఉగ్ర దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. వారిని ఎప్పటికీ మరిచిపోలేమని.. నష్టపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా పేర్కొన్నారు. దుఃఖంలోనూ.. సంకల్పంలోనూ ఒక దేశంగా ఐక్యంగా ఉన్నామన్నారు. భారతదేశం ఏ విధమైన ఉగ్రవాదానికి తలొగ్గదని.. ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావన్నారు.
Also Read
- Anti-Reservation stir: రిజర్వేషన్ హటావో ఉద్యమం ఎందుకు ఊపందుకుంది? దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
- Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
- Kerala Heavy Rains: కేరళలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి.. 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్
- Alluri Sitarama Raju International Airport: ఉత్తరాంధ్రకు గేట్వే.. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రత్యేకతలివే..
ఇది కూడా చదవండి: Trump: చర్చలకు ఇరాన్ నిరాకరణ.. చేసేదేమీలేక కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్.. అంతర్జాతీయంగా తీవ్ర చర్చ
గతేడాది ఇదే రోజున హిందువులను టార్గెట్గా చేసుకుని 26 మంది పురుషులను ఉగ్రవాదులు చంపేశారు. భార్య, పిల్లల ముందే చంపేశారు. కొత్తగా పెళ్లైన జంటలను కూడా వదిలిపెట్టకుండా నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. ఈ ఘటన యావత్తు దేశంతో పాటు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసింది. ఈ పరిణామాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మే 7న పాకిస్థాన్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. మొత్తానికి నాలుగు రోజుల యుద్ధం తర్వాత పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. అనంతరం పహల్గామ్లో కాల్పులకు తెగబడ్డ ముష్కరులను కూడా భద్రతా దళాలు అంతమొందించాయి.
Remembering the innocent lives lost in the gruesome Pahalgam terror attack on this day last year. They will never be forgotten. My thoughts are also with the bereaved families as they cope with this loss.
As a nation, we stand united in grief and resolve. India will never bow to…
— Narendra Modi (@narendramodi) April 22, 2026
తాజావార్తలు
-
Janhvi Kapoor: ‘రాకా’లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!
-
CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
-
Secret Soldier : టైటిల్ మారింది.. ‘సీక్రెట్ సోల్జర్’గా వస్తున్న ‘చైనా పీస్’!
-
GST Collections July 2026: దేశ ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. జూలైలో GST వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
-
Toyota Fortuner: పెట్రోల్, డీజిల్కు గుడ్ బై.. 100% ఇథనాల్తో నడిచే కొత్త టొయోటా ఫార్చ్యూనర్ వచ్చేసిందోచ్..!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!