PM Modi: ఎంత ఖర్చైనా భరిస్తాం… మా రైతులను బాధపెట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతైనా ఖర్చును భరిస్తాం.. కానీ మా రైతులను బాధపెట్టం అని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ కలోల్లో ఇఫ్కో నిర్మించిన నానో యూరియా (లిక్విడ్) ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ‘సహకార్ సే సమృద్’ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇండియా విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకుంటుందని.. ఇందులో ఒక్కో 50 కిలోల యూరియా బ్యాగ్ కు రూ.3500 చెల్లిస్తున్నామని.. అయితే రైతులకు మాత్రం బ్యాగ్ రూ. 300 కే ఇస్తున్నామని అన్నారు. కేంద్రంపై రూ. 3200 భారం పడుతుందని ఆయన అన్నారు. అయినా రైతుల కోసం భరిస్తామని మోదీ అన్నారు.
యుపి, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలలో మూతపడిన 5 ఎరువుల ఫ్యాక్టరీలను పునఃప్రారంభించామని ఇప్పటికే యూపీ, తెలంగాణాల్లో ఫ్యాక్టరీలు ఉత్పత్తిని ప్రారంభించాయని.. త్వరలోనే 3 కూడా ఉత్పత్తిని ప్రారంభిస్తాయని మోదీ వెల్లడించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియాకు వేపపూత పూశామని.. అప్పటి నుంచి యూరియా పక్కదారి పట్టకుండా రైతులకు అందేలా చేస్తున్నామని మోదీ అన్నారు.
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎరువుల వినియోగాదారుగా.. మూడో అతిపెద్ద ఎరువుల ఉత్పత్తిదారుగా ఉందని అన్నారు. ఏడెనిమిది ఏళ్ల క్రితం యూరియా రైతుల వద్దకు చేరుకోక బ్లాక్ మార్కెటింగ్ జరిగేదని ప్రస్తుతం ఈ పరిస్థితి మారిందని అన్నారు.
నానో యూరియా వల్ల యూరియా బస్తా ప్రస్తుతం సీసాలోకి కుదించబడిందని.. దీని వల్ల రవాణా ఖర్చులు ఎంతో తగ్గుతాయని.. చిన్ని రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం గాంధీనగర్లో నిర్మించిన ఈ ప్లాంట్ వల్ల 1.5 లక్షల బాటిళ్ల యూరియా లిక్విడ్ తయారు చేసే వీలుందని.. వచ్చే కాలంలో దేశ వ్యాప్తంగా ఇలాంటివి 8 ఫ్లాంట్లు ప్రారంభిస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!