PM Modi: ఎంత ఖర్చైనా భరిస్తాం… మా రైతులను బాధపెట్టం
ఎంతైనా ఖర్చును భరిస్తాం.. కానీ మా రైతులను బాధపెట్టం అని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ కలోల్లో ఇఫ్కో నిర్మించిన నానో యూరియా (లిక్విడ్) ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ‘సహకార్ సే సమృద్’ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇండియా విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకుంటుందని.. ఇందులో ఒక్కో 50 కిలోల యూరియా బ్యాగ్ కు రూ.3500 చెల్లిస్తున్నామని.. అయితే రైతులకు మాత్రం బ్యాగ్ రూ. 300 కే ఇస్తున్నామని అన్నారు. కేంద్రంపై రూ. 3200 భారం పడుతుందని ఆయన అన్నారు. అయినా రైతుల కోసం భరిస్తామని మోదీ అన్నారు.
యుపి, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలలో మూతపడిన 5 ఎరువుల ఫ్యాక్టరీలను పునఃప్రారంభించామని ఇప్పటికే యూపీ, తెలంగాణాల్లో ఫ్యాక్టరీలు ఉత్పత్తిని ప్రారంభించాయని.. త్వరలోనే 3 కూడా ఉత్పత్తిని ప్రారంభిస్తాయని మోదీ వెల్లడించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియాకు వేపపూత పూశామని.. అప్పటి నుంచి యూరియా పక్కదారి పట్టకుండా రైతులకు అందేలా చేస్తున్నామని మోదీ అన్నారు.
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎరువుల వినియోగాదారుగా.. మూడో అతిపెద్ద ఎరువుల ఉత్పత్తిదారుగా ఉందని అన్నారు. ఏడెనిమిది ఏళ్ల క్రితం యూరియా రైతుల వద్దకు చేరుకోక బ్లాక్ మార్కెటింగ్ జరిగేదని ప్రస్తుతం ఈ పరిస్థితి మారిందని అన్నారు.
నానో యూరియా వల్ల యూరియా బస్తా ప్రస్తుతం సీసాలోకి కుదించబడిందని.. దీని వల్ల రవాణా ఖర్చులు ఎంతో తగ్గుతాయని.. చిన్ని రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం గాంధీనగర్లో నిర్మించిన ఈ ప్లాంట్ వల్ల 1.5 లక్షల బాటిళ్ల యూరియా లిక్విడ్ తయారు చేసే వీలుందని.. వచ్చే కాలంలో దేశ వ్యాప్తంగా ఇలాంటివి 8 ఫ్లాంట్లు ప్రారంభిస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!