PM Modi: ఏఐ సమ్మిట్ దక్షిణాసియాకే గర్వకారణం

  • ఏఐ సమ్మిట్ దక్షిణాసియాకే గర్వకారణం
  • AI ఇంపాక్ట్ సమ్మిట్‌ ప్రారంభించిన ప్రధాని మోడీ
  • భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌
Modi1

Modi1

ఏఐ సమ్మిట్ నిర్వహణ భారత్కే కాదు.. దక్షిణాసియాకే గర్వకారణం అని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సమ్మిట్‌కు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ‘‘ఏఐపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చాయి. యువత ఇప్పుడు ఏఐని ప్రయోజనకరంగా ఉపయోగిస్తోంది. ఏఐ సదస్సు మేడిన్ ఇండియా, భారత్ సృజనకు వేదికగా నిలిచింది. ఈ సదస్సు భారతీయ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.’’ అని మోడీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: US-Iran: ఇరాన్‌ అష్టదిగ్బంధం.. భారీ దాడులకు అమెరికా ప్లాన్.. ఇజ్రాయెల్ అలర్ట్

‘‘కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు ఈ వేదిక దోహదం చేస్తుంది. ఏఐలో విజన్‌తో పాటు సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యం. మనం అణుశక్తి విధ్వంసాన్ని చూశాం. వికాసాన్ని చూశాం. ఏఐ కూడా అంతే.. ఏఐ కత్తికి రెండు వైపులా పదునున్న అస్త్రం. భారత్‌కు యువత కొత్త శక్తిగా, ఆస్తిగా మారారు. ఏఐ టెక్నాలజీ వినియోగం, వాటి ఫలితాలపై తుది నిర్ణయం మనిషిదే అయి ఉండాలి.’’’ అని సూచించారు.

భారత్ మండపంలో జరుగుతోన్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్, వివిధ దేశాల పెవిలియన్లు, ప్రపంచ నాయకులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: IAS Prasad: ఐఏఎస్ అధికారి మూడో రహస్య పెళ్లిపై వీడిన మిస్టరీ.. ఇంత ట్విస్టుందా?