PM Modi: స్వాతంత్య్ర దినోత్సవాన్ని గౌరవం, గర్వం, ఘనతతో జరుపుకోవాలని, అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్టులో పిలుపునిచ్చారు. అధికార ఎన్డీయే కూటమి ‘‘మంగళ్ మిలన్’’ సమావేశానికి హాజరైన సందర్భంగా ఎన్డీయే ఎంపీలు, కేంద్ర మంత్రులకు త్రివర్ణ జెండాలను ఊపుతూ ‘వందేహాతరం’, ‘భారత్ మాతాకి జై’ నినాదాలతో ఆయనకు స్వాగతం పలికిన వీడియోను మోడీ షేర్ చేశారు.
‘‘మన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిద్దాం, అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రతిజ్ఞ చేద్దాం. హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం. భారత్ మాతా కీ జై, వందే మాతరం’’ అని మోడీ తన వీడియోలో సందేశం ఇచ్చారు. అంతకుముందు పార్లమెంట్ హౌజ్లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్లీ సమావేశానికి చేరకున్న మోడీకి ఎన్డీయే నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్తో సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, శివరాజ్సింగ్ చౌహాన్, ఎస్ జైశంకర్ హాజరయ్యారు. ఎన్డీయే భాగస్వామ్యపక్ష నేతలు కూడా పాల్గొన్నారు.

