PM Modi: మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం.. పిల్లలతో సంభాషణ
- మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం
- సామాన్య ప్రయాణికుడిలా జర్నీ
- చిన్నారులు, ప్రయాణికులతో ముచ్చట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ సామాన్యుడిలా మారిపోయారు. భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి ప్రజలతో మమేకం అయిపోయారు. రొటిన్కు భిన్నంగా శనివారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి సందడి చేశారు. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు మెట్రోలో ప్రయాణించి కాలేజీకి వెళ్లారు. చేతిలో మెట్రో కార్డు పట్టుకుని ప్రయాణించిన ప్రధాని.. మార్గమధ్యంలో విద్యార్థులు, తోటి ప్రయాణికులతో సరాదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మెట్రోలో మోడీ ముచ్చట్లు
SRCC 100వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రసంగించేందుకు వెళ్లిన ప్రధాని మోడీ.. సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రోలో ఉన్న చిన్నారులతో…విద్యార్థులతో.. ఇతర ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రతిరోజూ ఢిల్లీ మెట్రోలో కనిపించే సాధారణ దృశ్యానికి.. ప్రధాని మోడీ ప్రయాణం ప్రత్యేకతను తీసుకొచ్చింది. కాలేజీకి చేరుకునే క్రమంలో ఆయన పలువురితో ఆప్యాయంగా మాట్లాడారు.
Also Read
- Pappu Yadav: భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
SRCCకి 100 ఏళ్లు
ప్రధాని మోడీ హాజరవుతున్న ఈ కార్యక్రమం SRCCకి ఎంతో ప్రత్యేకమైనది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ తన 100 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. SRCC శతాబ్ది వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుత విద్యార్థులతో పాటు కాలేజీ మాజీ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో SRCC శతాబ్ది వేడుకలు పలు తరాల విద్యార్థులు, అధ్యాపకులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నాయి.
13 ఏళ్ల తర్వాత మళ్లీ కాలేజీలోకి..
SRCCలో ప్రధాని మోడీ పర్యటించడం 13 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆయన చివరిసారిగా 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో SRCCని సందర్శించారు. ఈ ఏడాది ఏప్రిల్లో SRCC శతాబ్ది వేడుకల సందర్భంగా కాలేజీ గవర్నింగ్ బాడీ, ప్రతినిధి బృందాన్ని ప్రధాని మోడీ తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా SRCC 100 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక తపాలా బిళ్లను కూడా విడుదల చేశారు. ఇప్పుడు నెలల తర్వాత ప్రధాని స్వయంగా SRCCకి చేరుకున్నారు. మెట్రో కార్డు చేతిలో పట్టుకుని విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటిస్తూ ఆయన చేసిన ఈ ప్రయాణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”><a href=”https://x.com/hashtag/WATCH?src=hash&ref_src=twsrc%5Etfw”>#WATCH</a> | Delhi: Prime Minister Narendra Modi traveled by the Delhi Metro today as he headed to Shri Ram College of Commerce (SRCC) to participate in the college's centenary celebrations.<br><br>(Source: DD) <a href=”https://t.co/AVqtS38z6P”>pic.twitter.com/AVqtS38z6P</a></p>— ANI (@ANI) <a href=”https://x.com/ANI/status/2096230534510977352?ref_src=twsrc%5Etfw”>September 5, 2026</a></blockquote> <script async src=”https://platform.x.com/widgets.js” charset=”utf-8″></script>
తాజావార్తలు
-
PM Modi: మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం.. పిల్లలతో సంభాషణ
-
R. Narayana Murthy: ‘కామ్రేడ్’ పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
-
TG SAFE : పనీర్ పేరుతో పామ్ ఆయిల్ గేమ్.. 14 డెయిరీలపై TG SAFE దాడులు
-
Legacy: విశ్వక్ సేన్ ‘లెగసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pappu Yadav: భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!