PM Modi: మమత సర్కార్పై మోడీ తీవ్ర విమర్శలు.. ‘నిర్మంత’ అంటూ వ్యాఖ్య
- మమత సర్కార్పై మోడీ తీవ్ర విమర్శలు
- మమతను ఉద్దేశించి హిందీలో ‘నిర్మంత’ అంటూ వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్పై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందిన తర్వాత పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. హింస చెలరేగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ముర్షిదాబాద్, మాల్డాలో జరిగిన హింసను ఉద్దేశించి మమతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందీలో క్రూరత్వం అని అర్థం వచ్చేలా మమతను ‘నిర్మంత’ అనే మాటను ఉపయోగించారు. ‘క్రూరత్వం లేదా ఉదాసీనతకు ప్రతీక అని అర్థం వస్తుంది. శాంతిభద్రతలను కాపాడటంలో మమత సర్కార్ పూర్తిగా విఫలమైందని మోడీ ధ్వజమెత్తారు. పౌరుల ప్రాణాలను కాపాడటంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: YS Jagan: మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. గాయపడిన వృద్ధురాలిని..!
Also Read
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
గురువారం పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇండియా… విక్షిత్ భారత్గా మారాలంటే.. పశ్చిమ బెంగాల్ను కూడా విక్షిత్ పశ్చిమ బెంగాల్గా మార్చడం ముఖ్యమని తెలిపారు. పశ్చిమ బెంగాల్కు కొత్త శక్తిని నింపాల్సిన అవసరం ఉందని.. జ్ఞానం.. విజ్ఞాన కేంద్రంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Ileana D’Cruz: మళ్లీ తల్లికాబోతున్న హీరోయిన్.. నెట్టింట బేబీ బంప్ ఫోటో వైరల్..!
నేడు పశ్చిమ బెంగాల్ అనేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోందని చెప్పారు. మొదటి సంక్షోభం.. సమాజంలో హింస, అరాచకం ప్రబలంగా ఉందని తెలిపారు. రెండోవ సంక్షోభం.. తల్లులు, సోదరీమణులు సురక్షితంగా లేరని.. వారిపై నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. మూడోవ సంక్షోభం.. యువత అనుభవిస్తున్న నిరాశ, నిరుద్యోగం అన్నారు. నాల్గోవ సంక్షోభం.. అవినీతి, వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోవడం.. ఐదో సంక్షోభం.. పేద ప్రజల హక్కులను స్వార్థ రాజకీయాల కోసం పాలక పార్టీ లాక్కుంటోందని మోడీ విమర్శించారు.
ఇక అలిపుదుర్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్కు మోడీ శంకుస్థాపన చేశారు. ‘‘పశ్చిమ బెంగాల్లో మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు మరియు పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం వేగం అందిస్తోంది. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి భారతదేశ పురోగతికి పునాది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) ప్రాజెక్ట్ ద్వారా ప్రజలు ఇకపై సిలిండర్లు కొనవలసిన అవసరం ఉండదు. గృహాల్లో సురక్షితమైన గ్యాస్ పంపిణీ అందించబడుతుంది. ఇది డబ్బు, సమయం ఆదా చేస్తుంది. పర్యావరణానికి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ విధానాల ఇంటింటికీ డెలివరీకి ఒక ఉదాహరణ” అని మోడీ అన్నారు.
- Tags
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!