PM Modi: మమత సర్కార్పై మోడీ తీవ్ర విమర్శలు.. ‘నిర్మంత’ అంటూ వ్యాఖ్య
- మమత సర్కార్పై మోడీ తీవ్ర విమర్శలు
- మమతను ఉద్దేశించి హిందీలో ‘నిర్మంత’ అంటూ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్పై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం పొందిన తర్వాత పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. హింస చెలరేగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ముర్షిదాబాద్, మాల్డాలో జరిగిన హింసను ఉద్దేశించి మమతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందీలో క్రూరత్వం అని అర్థం వచ్చేలా మమతను ‘నిర్మంత’ అనే మాటను ఉపయోగించారు. ‘క్రూరత్వం లేదా ఉదాసీనతకు ప్రతీక అని అర్థం వస్తుంది. శాంతిభద్రతలను కాపాడటంలో మమత సర్కార్ పూర్తిగా విఫలమైందని మోడీ ధ్వజమెత్తారు. పౌరుల ప్రాణాలను కాపాడటంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: YS Jagan: మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. గాయపడిన వృద్ధురాలిని..!
Also Read
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
గురువారం పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇండియా… విక్షిత్ భారత్గా మారాలంటే.. పశ్చిమ బెంగాల్ను కూడా విక్షిత్ పశ్చిమ బెంగాల్గా మార్చడం ముఖ్యమని తెలిపారు. పశ్చిమ బెంగాల్కు కొత్త శక్తిని నింపాల్సిన అవసరం ఉందని.. జ్ఞానం.. విజ్ఞాన కేంద్రంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Ileana D’Cruz: మళ్లీ తల్లికాబోతున్న హీరోయిన్.. నెట్టింట బేబీ బంప్ ఫోటో వైరల్..!
నేడు పశ్చిమ బెంగాల్ అనేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోందని చెప్పారు. మొదటి సంక్షోభం.. సమాజంలో హింస, అరాచకం ప్రబలంగా ఉందని తెలిపారు. రెండోవ సంక్షోభం.. తల్లులు, సోదరీమణులు సురక్షితంగా లేరని.. వారిపై నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. మూడోవ సంక్షోభం.. యువత అనుభవిస్తున్న నిరాశ, నిరుద్యోగం అన్నారు. నాల్గోవ సంక్షోభం.. అవినీతి, వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోవడం.. ఐదో సంక్షోభం.. పేద ప్రజల హక్కులను స్వార్థ రాజకీయాల కోసం పాలక పార్టీ లాక్కుంటోందని మోడీ విమర్శించారు.
ఇక అలిపుదుర్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్కు మోడీ శంకుస్థాపన చేశారు. ‘‘పశ్చిమ బెంగాల్లో మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలు మరియు పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం వేగం అందిస్తోంది. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి భారతదేశ పురోగతికి పునాది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) ప్రాజెక్ట్ ద్వారా ప్రజలు ఇకపై సిలిండర్లు కొనవలసిన అవసరం ఉండదు. గృహాల్లో సురక్షితమైన గ్యాస్ పంపిణీ అందించబడుతుంది. ఇది డబ్బు, సమయం ఆదా చేస్తుంది. పర్యావరణానికి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ విధానాల ఇంటింటికీ డెలివరీకి ఒక ఉదాహరణ” అని మోడీ అన్నారు.
- Tags
తాజావార్తలు
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!