PM Modi: న్యాయాధికారులకే రక్షణ లేదు, సామాన్యుల పరిస్థితి ఏంటి..? మమతపై మోడీ ఫైర్..
PM Modi: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం విమర్శలు గుప్పించారు. మాల్దా ఘటనలో న్యాయాధికారుల్ని నిర్బంధించిన ఘటనపై మోడీ మాట్లాడారు. మాల్దా ఘటన టీఎంసీ ‘‘మహా జంగిల్ రాజ్’’కు నిదర్శనమని ఆయన అభివర్ణించారు. బెంగాల్లో శాంతిభద్రతలకు అంత్యక్రియలు జరిపించాలని మమతా సర్కార్ కంకణం కట్టుకుందని ఆయన ఆరోపించారు.
కూచ్ బెహార్ జిల్లాలో తొలిసారి ప్రధాని మోడీ తొలి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మాల్దాలో న్యాయాధికారులను ఎలా బందీలుగా పట్టుకున్నారో దేశం మొత్తం చూసిందని మోదీ అన్నారు. న్యాయమూర్తుల భద్రతను, రాజ్యాంగపరమైన ప్రక్రియలను కూడా రక్షించలేని ప్రభుత్వం, ఏ రకమైన ప్రభుత్వం అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రభుత్వం బెంగాల్ ప్రజలను సురక్షితంగా ఉంచుతుందని మనం ఆశించలేమని చెప్పారు. న్యాయాధికారులకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. మాల్దా ఘటన టీఎంసీ మహా జంగిల్ రాజ్కు ఒక నిదర్శమని ఆరోపించారు.
Also Read
- Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
Read Also: Donald Trump: ఇరాన్తో సోమవారం నాటికి ఒప్పందం, లేదంటే అంతా నాశనం..
మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, టీఎంసీ ప్రభుత్వం ఏ ఒక్క రాజ్యాంగ సంస్థకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని మోడీ ఆరోపించారు. ఈ నిర్దాక్షిణ్యమైన టీఎంసీ పరిపాలన, బెంగాల్ అనే పవిత్రగడ్డపై ప్రజాస్వామ్యం ప్రతీరోజు రక్తమోడుతోందని అన్నారు. ఇక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని మోడీ అన్నారు.
మాల్దా ఘటన బుజ్జగింపు రాజకీయాలు, చొరబాట్ల ద్వారా టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ భవిష్యత్తును, గుర్తింపును ప్రమాదంలో పడేసిందని మోడీ ఆరోపించారు. టీఎంసీ పాలనలో బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రమాదకరమైన జనాభా మార్పు చోటుచేసుకుంది. ఈ చొరబాటుదారులకు టీఎంసీ సిండికేట్ నుంచి ప్రత్యక్ష రక్షణ లభిస్తోందని, దీంతో రాష్ట్ర ప్రజలకు ముప్పు వాటిల్లుతోందని ఆయన ఆరోపించారు. చొరబాటుదారులను కాపాడేందుకు టీఎంసీ పౌరసత్వ సవరణ చట్టాన్ని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియను వ్యతిరేకిస్తోందని కూడా ప్రధాని ఆరోపించారు.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!