Site icon NTV Telugu

Breaking News: సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం..

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. అయితే, ఏ అంశంపై ప్రధాని మాట్లాడుతారనే దానిపై అధికార వర్గాలు ధ్రువీకరించలేదు. దీంతో ప్రధాని ఏ అంశం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రసంగం జీఎస్టీ(GST) సంస్కరణలకు ముందు వస్తోంది.రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. ప్రధాని ప్రసంగంలో ఈ అంశం ఉండే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాతో టారిఫ్ వార్, H1 B వీసాదారులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోవడంపై కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న H1 B చర్యలు, వేలాది మంది భారతీయ టెక్కీలను గణనీయంగా ప్రభావివం చేస్తుంది.

Read Also: Fake Notes: దుబ్బాకలో దొంగనోట్ల కలకలం.. ఒకే నంబర్ తో కూడిన రూ. 200 నోట్లు ప్రత్యక్షం

2014లో ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి పలు సందర్భాల్లో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు. కీలక నిర్ణయాలను ప్రకటించారు. నవంబర్ 8, 2016 న, ఆయన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించి, రూ. 500 మరియు రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాద దాడి తరువాత ప్రారంభించిన బాలాకోట్ వైమానిక దాడులను ప్రధాన మంత్రి ప్రకటించిన మార్చి 12, 2019 న మరోసారి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి మూడు వారాల దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించడానికి ప్రధాన మంత్రి మార్చి 24, 2020 న దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. లాక్‌డౌన్ పొడిగింపును ప్రకటించడానికి ఆయన ఏప్రిల్ 14, 2020 న మళ్ళీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మే నెలలో, ప్రభుత్వం లాక్‌డౌన్‌ను సడలించాలని నిర్ణయించిందని ఆయన జాతికి తెలిపారు.ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ గురించి మే 12, 2025లో దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు.

Exit mobile version