Site icon NTV Telugu

India-US Trade deal: “అమెరికాతో అత్యుత్తమ ఒప్పందం”.. ట్రేడ్ డీల్‌పై కేంద్రం కీలక ప్రకటన..

Piyush Goel

Piyush Goel

India-US Trade deal: భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మంగళవారం మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ అమెరికాతో ‘‘సాధ్యమైనంత ఉత్తమైన’ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని అన్నారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సన్నిహిత వ్యక్తిగత సంబంధం కారణంగా ఈ ఒప్పందం ఖరారైందని వెల్లడించారు. రైతులు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలతో సహా అనేక రంగాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.

Read Also: Eyeball Tattoo: పిచ్చికి పరాకాష్ట.. కనుగుడ్లపై టాటూ వేయించుకున్న యువకుడు..

ఈ ఒప్పందంలో వ్యవసాయం, పాడి రంగాలకు పూర్తి రక్షణ కల్పించామని గోయల్ వెల్లడించారు. రైతుల ప్రయోజాలను తాకట్టు పెట్టారని ఆరోపిస్తు్న్న ప్రతిపక్షాల వాదనల్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ భారత్‌ను వెనక్కి తోసేయడానికి సిద్ధం ఉన్న సమయంలో ప్రధాని మోడీ దేశాన్ని రక్షించారని అన్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా అమెరికా ఒప్పందంలో వ్యవసాయం, డైరీ రంగాలను కాపాడారని అన్నారు. ఎంఎస్ఎంఈలు, మహిళలకు లాభం కలుగుతుందని చెప్పారు.

లోక్‌సభలో ట్రేడ్ డీల్‌పై ప్రభుత్వం తన వాదనల్ని వినిపించాలనుకున్న సమయంలో ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకుందని గోయల్ ఆరోపించారు. రాహుల్ గాంధీ సభలో ప్రవర్తించిన తీరును దేశం మొత్తం చూసిందని చెప్పారు. ఈ ఒప్పందం ఒక్కరోజులో కుదరలేదని, రెండు దేశాల మధ్య అనేక నెలల చర్చల ఫలితమే ఇది అని గోయల్ చెప్పారు. ఈ డీల్ ప్రపంచవేదికపై భారత్‌ను మరింత బలమైన దేశంగా నిలబెడుతుందని చెప్పారు.

Exit mobile version