Gujarat: కన్నీళ్లు తెప్పిస్తున్న జెట్ పైలట్ మృతి.. వారం క్రితమే నిశ్చితార్థం.. ఇంతలో విషాదం
- కన్నీళ్లు తెప్పిస్తున్న జెట్ పైలట్ మృతి
- వారం క్రితమే నిశ్చితార్థం..
- ఇంతలో జెట్ ప్రమాదంలో సిద్ధార్ధ మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లోని జామ్నగర్లో గురువారం అర్ధరాత్రి ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిన ఘటనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఒక పైలట్ ప్రాణాలు కోల్పోగా.. మరొక పైలట్ గాయాలతో బయటపడ్డాడు.
అయితే ఈ దుర్ఘటనలో సిద్ధార్థ్ యాదవ్(28) అనే పైలట్ ప్రాణాలు వదిలాడు. 2016లో నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పరీక్ష (NDA)లో ఉత్తీర్ణత సాధించి భారత వైమానిక దళంలో చేరాడు. గత నెల మార్చి 23న నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2న వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఇందుకోసం సిద్ధార్థ యాదవ్ సిద్ధపడుతున్నాడు. కానీ ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది.
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
శిక్షణలో ఉండగా ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్లో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే జామ్నగర్ జిల్లాలోని సువార్ద గ్రామంలోకి వచ్చేటప్పటికీ ప్రమాదం పొంచి ఉందని గుర్తించాడు. ఇళ్ల మధ్య కూలిపోతే.. పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని భావించాడు. ప్రమాదం నుంచి ప్రజలను కాపాడాలని నిర్ణయం తీసుకున్నాడు.. తనతో పాటు ఉన్న కో-పైలట్ను కిందకు దించేసి.. జనసాంద్రత లేని ప్రాంతానికి జెట్ను నడిపించాడు. సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించాడు.. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. దీంతో సిద్ధార్ధ యాదవ్ అమరడుయ్యాడు. కానీ గ్రామస్తుల ప్రాణాలను కాపాడి.. ఒక సాహస వీరుడయ్యాడు.
బుధవారం రాత్రి గుజరాత్లోని జామ్నగర్ సమీపంలోని వైమానిక దళం స్టేషన్ నుంచి జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. కొన్ని నిమిషాల్లోనే కూలిపోవడంతో రేవారీ నివాసి అయిన ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ మరణించాడు. సిద్ధార్ధ ఇటీవలే సెలవుల తర్వాత విధులకు రావడం విశేషం.
సుశీల్-నీలం యాదవ్ల ఏకైక కుమారుడు సిద్ధార్థ్ యాదవ్. ఫైటర్ పైలట్గా శిక్షణ పూర్తి చేసి 2016లో NDA పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత భారత వైమానిక దళంలో చేరాడు. రెండేళ్ల క్రితమే ఫ్లైట్ లెఫ్టినెంట్గా పదోన్నతి లభించింది. రేవారిలోని భల్కి-మజ్రా గ్రామానికి చెందిన సిద్ధార్ధ కుటుంబం నవంబర్ 2న జరగాల్సిన వివాహం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే సిద్ధార్థ తిరిగి విధుల్లో చేరాడు. కానీ ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. దీంతో బంధువులంతా కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక కుమారుడి యొక్క ధైర్య సాహసాలను తండ్రి సుశీల్ యాదవ్ ప్రశంసించారు. ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!