Yogi Adityanath: ‘‘ పందులు, రాబందులు ’’.. కుంభమేళా విమర్శకులపై యోగి ఫైర్..
- కుంభమేళా విమర్శకులపై యోగి ఆదిత్యనాథ్ ఫైర్..
- రాబందులు, పందులు అంటూ ఆగ్రహం..
- అఖిలేష్ యాదవ్ టార్గెట్గా సంచలన విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: మహా కుంభమేళా ముగింపుకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 26 మహా శివరాత్రితో ఈ కార్యక్రమం పూర్తవుతోంది. తాజాగా, మహా కుంభమేళాపై విపక్షాల విమర్శల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేళా అనేది ప్రజలు కోరికలు కోరుకునే ఒక నిధి అని ఆయన అన్నారు. ‘‘రాబందులకు శవాలు వచ్చాయి, పందులకు మురికి లభించింది. అయితే మంచి వ్యక్తులకు సంబంధాల అందమైన చిత్రం లభించింది. వ్యాపారులకు వ్యాపారం లభించింది. భక్తులకు శుభ్రమైన ఏర్పాటు లభించాయి’’ అని యోగి అన్నారు.
కుంభమేళ తొక్కిసలాటలో 18 మంది భక్తులు చనిపోయిన తర్వాత ప్రతిపక్షాలు యూపీ సర్కార్పై విమర్శలు గుప్పించాయి. ‘‘ఒక నిర్దిష్ట కులం అక్కడికి వెళ్లకుండా ఆపారని మీరు (ప్రతిపక్షం) ఆరోపించింది. ఏ కులాన్ని కూడా ఆపలేదు. మంచి ఉద్దేశ్యంతో ఉన్న వారు ఎవరైనా కుంభ్కి గౌరవంగా వెళ్లాలి. కానీ చెడు ఉద్దేశ్యంతో అక్కడికి వెళ్లే వారు, గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తే ఖచ్చితంగా నష్టపోతారు’’అని యోగి ఆదిత్య నాథ్ అన్నారు.
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
Read Also: PM Modi: లాలూ ‘‘జంగిల్ రాజ్’’ నేత.. బీహార్ ఎప్పటికీ వారిని క్షమించదు..
‘‘మేము మీలా భక్తుల విశ్వాసాలతో ఆడుకోలేదు. మీ కాలం(సమాజ్వాదీ పార్టీ పాలన)లో ముఖ్యమంత్రి(అఖిలేష్ యాదవ్) కార్యక్రమాన్ని చూడలేదు, కనీసం సమీక్షించలేదు. హిందూ మతానికి చెందని(ఆజాంఖాన్)కి కుంభమేళా బాధ్యతలు అప్పగించారు’’ అని అఖిలేష్ యాదవ్పై విమర్శలు చేశారు. ‘‘కానీ ఇక్కడ నేను స్వయంగా కుంభ్ని సమీక్షిస్తున్నాను. 2013లో కుంభ్కు వెళ్ళిన వారందరికీ గందరగోళం, అవినీతి, కాలుష్యం కనిపించడానికి ఇదే కారణం. గంగా, యమునా మరియు సరస్వతి నదుల త్రివేణిలో స్నానం చేయడానికి నీరు సరిపోలేదు. స్నానం చేయడానికి నిరాకరించిన మారిషస్ ప్రధానమంత్రి దీనికి ఉదాహరణ’’ అని యోగి ఆదిత్యనాథ్ అప్పటి అఖిలేష్ యాదవ్ సర్కార్పై ధ్వజమెత్తారు.
కుంభమేళాని ఉద్దేశించి పలువురు ప్రతిపక్ష నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడుతూ..గంగలో స్నానం చేస్తే పేదరికం పోతుందా.? అని ప్రశ్నించారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ‘‘గంగలో శవాలు పారేస్తున్నారు’’ అని ఆరోపించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కుంభమేళాని ‘‘మృత్యుకుంభ్’’గా పిలిచారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుంభ్ని ‘‘పనికిరానిది’’గా కొట్టిపారేశారు. ఈ విమర్శల నేపథ్యంలో యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!