PFI targeting RSS leaders: ఆర్ఎస్ఎస్ నేతలను టార్గెట్ చేసిన పీఎఫ్ఐ.. నేతల కదలికపై నిఘా
PFI targeting RSS leaders: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) గురించి నెమ్మనెమ్మదిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంతో పాటు ముస్లిం దేశాల నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయడం, ముస్లిం యువతను అల్ ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపించడం వంటి అభియోగాలను ఎదుర్కొంటోంది పీఎఫ్ఐ. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకులను, బీజేపీ నాయకులను టార్గెట్ చేసినట్లుగా మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ వర్గాలు తెలిపాయి.
వచ్చే దసరా సందర్భంగా బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని వారి కదలికలపై నిఘా పెట్టాలని పీఎఫ్ఐ భావించినట్లు మహారాష్ట్ర ఏటీఎస్ తెలిపింది. ఆర్ఎస్ఎస్ నాగ్ పూర్ ప్రధాన కార్యాలయం పీఎఫ్ఐ లక్ష్యాల్లో ఉంది. దసరా సందర్భంగా ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు పీఎఫ్ఐ ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: JP Nadda: 2024 వరకు అధ్యక్షుడిగా జేపీ నడ్డా.. పొడిగించే ఆలోచనలో బీజేపీ
గతవారం ఎన్ఐఏ, ఈడీలు 11 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో పీఎఫ్ఐ సంస్థపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. 106 మంది పీఎఫ్ఐ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంది. వారి కార్యాలయాల నుంచి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ డివైసెస్, మొబైల్స్, కంప్యూటర్లను స్వాధీనం చేసుకుంది. పీఎఫ్ఐ దేశంలో ఉద్రిక్తత పెంచేందుకు ప్రయత్నిస్తోందని.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. ఇటీవల పీఎఫ్ఐ కేసులో అరెస్ట్ అయిన వారిలో మహారాష్ట్ర నుంచి 20 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సంస్థను నిషేధించాలని డిమాండ్లు వస్తున్నాయి. పలు ముస్లిం సంస్థలు కూడా ఈ డిమాండ్ కు మద్దతు ఇస్తున్నాయి.
మరోవైపు పీఎఫ్ఐ కార్యకర్తల అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లో పీఎఫ్ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నాయి. ఇదిలా ఉంటే పీఎఫ్ఐ అరెస్టుల తర్వాత నుంచి తమిళనాడు వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ కార్యాలయాలే లక్ష్యంగా పెట్రోల్ బాంబుల దాడులు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!