Petrol: బంపరాఫర్.. అక్కడ రూపాయికే లీటర్ పెట్రోల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి.. వాహనాలు బయటకు తీయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. సామాన్యులకు భారంగా మారిన పెట్రో ధరలు.. క్రమంగా అన్ని రకాల ఉత్పత్తులపై భారం మోపుతున్నాయి.. అయితే, రూపాయికే లీటర్ పెట్రోల్ ప్రకటించిందో సంస్థ.. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా… మహారాష్ట్ర సోలాపూర్లో ఈ ఆఫర్ తీసుకొచ్చారు.. అయితే, కొన్ని షరతులు కూడా పెట్టారు.. మొదట తన పెట్రోల్ పోయించుకున్న 500 మంది మాత్రమే రూపాయికే లీటర్ పెట్రోల్ అనే ఆఫర్ తీసుకొచ్చారు. అసలే పెరిగిన ధరలతో అల్లాడిపోతున్న జనం.. ఆ పెట్రోల్ బంకు వద్ద బారులు తీరారు. ప్రతి కొనుగోలుదారునికి ఒక లీటరు ఇంధనం మాత్రమే ఇచ్చారు నిర్వాహకులు.. అయినప్పటికీ, ప్రజలు పెట్రోల్ పంప్ వద్ద కిక్కిరిసిపోయింది.. వాహనాల రద్దీ పెరగడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
Read Also: KS Eshwarappa: సీఎం ఆదేశాలు.. ఇవాళ ఆ మంత్రి రాజీనామా..
Also Read
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
డాక్టర్ అంబేద్కర్ విద్యార్థులు, యూత్ పాంథర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.. కాగా, ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ ధర లీటర్ రూ.120కి చేరింది. కాబట్టి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడానికి, మేము ఒక్క రూపాయికే పెట్రోల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అని ఆ సంస్థ రాష్ట్ర యూనిట్ నాయకుడు మహేష్ సర్వగోడ వెల్లడించారు.. మా లాంటి చిన్న సంస్థ 500 మందికి ఉపశమనం కలిగించగలిగింది.. ప్రభుత్వం కూడా సహాయం అందించాలి అని సూచించారు. ఇక, రూపాయికే పెట్రోలు కొనడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు పలువురు కొనుగోలు దారులు..
తాజావార్తలు
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!