Petrol: బంపరాఫర్.. అక్కడ రూపాయికే లీటర్ పెట్రోల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి.. వాహనాలు బయటకు తీయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. సామాన్యులకు భారంగా మారిన పెట్రో ధరలు.. క్రమంగా అన్ని రకాల ఉత్పత్తులపై భారం మోపుతున్నాయి.. అయితే, రూపాయికే లీటర్ పెట్రోల్ ప్రకటించిందో సంస్థ.. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా… మహారాష్ట్ర సోలాపూర్లో ఈ ఆఫర్ తీసుకొచ్చారు.. అయితే, కొన్ని షరతులు కూడా పెట్టారు.. మొదట తన పెట్రోల్ పోయించుకున్న 500 మంది మాత్రమే రూపాయికే లీటర్ పెట్రోల్ అనే ఆఫర్ తీసుకొచ్చారు. అసలే పెరిగిన ధరలతో అల్లాడిపోతున్న జనం.. ఆ పెట్రోల్ బంకు వద్ద బారులు తీరారు. ప్రతి కొనుగోలుదారునికి ఒక లీటరు ఇంధనం మాత్రమే ఇచ్చారు నిర్వాహకులు.. అయినప్పటికీ, ప్రజలు పెట్రోల్ పంప్ వద్ద కిక్కిరిసిపోయింది.. వాహనాల రద్దీ పెరగడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
Read Also: KS Eshwarappa: సీఎం ఆదేశాలు.. ఇవాళ ఆ మంత్రి రాజీనామా..
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
డాక్టర్ అంబేద్కర్ విద్యార్థులు, యూత్ పాంథర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.. కాగా, ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ ధర లీటర్ రూ.120కి చేరింది. కాబట్టి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడానికి, మేము ఒక్క రూపాయికే పెట్రోల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అని ఆ సంస్థ రాష్ట్ర యూనిట్ నాయకుడు మహేష్ సర్వగోడ వెల్లడించారు.. మా లాంటి చిన్న సంస్థ 500 మందికి ఉపశమనం కలిగించగలిగింది.. ప్రభుత్వం కూడా సహాయం అందించాలి అని సూచించారు. ఇక, రూపాయికే పెట్రోలు కొనడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు పలువురు కొనుగోలు దారులు..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!