Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘పౌరసత్వం’’ రద్దు చేయాలని పిటిషన్..
- రాహుల్ గాంధీ పౌరసత్వంపై అలహాబాద్ హైకోర్టు విచారణ..
- సీబీఐ విచారణ డిమాండ్ చేసిన పిటిషన్..
- కేంద్ర స్పందన కోరిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు అలహాబాద్ హైకోర్టుకు తెలియజేసింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది. రాహుల్ గాంధీపై సీబీఐ విచారణ జరపాలని న్యాయవాది, బీజేపీ నేత విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారించింది. రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారనే ఆధారాలు ఉన్నట్లు పిటిషనర్ ఆరోపించారు. గతంలో వీఎస్ఎస్ శర్మ చేసిన విచారణలో యూకే ప్రభుత్వం నుంచి వచ్చిన ఈమెయిళ్లను ఉదహరించారు.
Read Also: Supreme Court: ‘‘మీరు ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లా..?’’ కేఏ పాల్ పిటిషన్పై ఆగ్రహం..
Also Read
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్డ్రా..
రాహుల్ గాంధీ పౌరసత్వంపై సమాచారం కోసం శర్మీ 2022లో యూకే అధికారులను సంప్రదించారు. యూకే ప్రభుత్వం కొన్ని వివరాలను ధృవీకరించినట్లు నివేదించబడినప్పటికీ, డేటా రక్షణ చట్టాలు, రాహుల్ గాంధీ అధికారిక లేఖ లేకపోవడంతో పూర్తి సమాచారాన్ని వెల్లడించడానికి నిరాకరించింది. ఈ కేసుపై నవంబర్ 25 డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్ బీ పాండే, ఈ కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాక స్వీకరించినట్లు, దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు కోర్టుకు వివరించారు. తదుపరి విచారణ లోగా కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పాలని జస్టిస్ అట్టౌ రెహమాన్ మసూది, జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం, ఏ వ్యక్తి కూడా భారత పౌరసత్వాన్ని మరియు మరొక దేశం యొక్క పౌరసత్వాన్ని ఏకకాలంలో కలిగి ఉండకూడదు. అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ పరిశీలనలో ఉండగా, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో కూడా ఇదే పిటిషన్ దాఖలు చేశారు. అలహాబాద్ హైకోర్టు విచారణ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కేసును విచారిస్తామని ఢిల్లీ కోర్టు సూచించింది.
తాజావార్తలు
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్ఫ్లిక్స్ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..