India Pakistan War: భారత్, పాక్‌ ప్రధానులకు విజ్ఞప్తి.. యుద్ధాన్ని ముగించండి..!

  • యుద్ధాన్ని ముగించండి అంటూ భారత, పాక్ ప్రధానులకు విజ్ఞప్తి..
  • యుద్ధంతో ఏం సాధించారని ప్రశ్నించిన పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ..
  • కాల్పుల్లో పిల్లలు, మహిళలు చిక్కుకుపోవడానికి వారి చేసిన తప్పు ఏమిటి?..
Mehbooba Mufti

Mehbooba Mufti

India Pakistan War: ఇక, యుద్ధాన్ని ముగించండి అంటూ భారత, పాకిస్తాన్‌ ప్రధానులకు విజ్ఞప్తి చేశారు పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ.. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ కాల్పుల్లో పిల్లలు, మహిళలు చిక్కుకుపోవడానికి వారి చేసిన తప్పు ఏమిటి? అని ప్రశ్నించారు.. సైనిక చర్య సమస్యను పరిష్కరించదని అభిప్రాయపడిన ఆమె.. ఇది ఎప్పుడూ సమస్యను పరిష్కరించదు.. శాంతిని అందించదు అన్నారు… రెండు దేశాలు సైనిక జోక్యాన్ని కాకుండా రాజకీయ జోక్యాన్ని ఎంచుకోవాలని సూచించారు..

Read Also: Amala Paul : నేను హీరోయిన్‌ని అనే విషయం నా భ‌ర్తకి చెప్పలేదు..

పుల్వామా దాడికి ప్రతిస్పందనగా బాలకోట్ వైమానిక దాడి తర్వాత మనం ఏమి సాధించాం? అని ప్రశ్నించారు మొహబూబా ముఫ్తీ.. ఈ దాడిని ముగించాలని నేను రెండు వైపులా నాయకత్వాన్ని కోరుతున్నాను… జమ్మూ మరియు కశ్మీర్‌ ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, దీని పర్యవసానాలను ఎంతకాలం అనుభవిస్తారు? అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించినట్లు పేర్కొన్న తర్వాత వారి ఉద్దేశ్యం నెరవేరింది. అదేవిధంగా, పాకిస్తాన్ మన ఫైటర్ జెట్లను కూల్చివేసి, పూంచ్‌లోని బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసిందని చెబుతోంది.. అంటే వారిద్దరూ సమానంగా ఖాతాలను పరిష్కరించుకున్నారని పేర్కొన్నారు. యుద్ధ యుగం ముగిసిందని హామీ ఇచ్చిన పాకిస్తాన్ నాయకత్వానికి మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను… ఇద్దరు ప్రధానులు ఫోన్ చేసి ఈ సంఘర్షణను పరిష్కరించగలిగితే.. ఇరు దేశాలకు, ప్రజలకు ఎంతో ఉపయోగం అని అన్నారు పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ..