Bihar: ఎన్నికల ముందు మరొక హత్య.. ఆస్పత్రిలో పేషెంట్ కాల్చివేత
- ఎన్నికల ముందు బీహార్లో మరొక హత్య
- ఆస్పత్రిలో పేషెంట్ కాల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్లో హత్యల పరంపర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న బీజేపీ నేత, వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా ఇంటి దగ్గరే హత్యకు గురయ్యారు. కారులో ఇంటికి చేరిన ఆయన్ను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందు తాజాగా గురువారం ఉదయం పట్టపగలు ఆస్పత్రిలో కరుడుగట్టిన ఒక నేరస్థుడ్ని ప్రత్యర్థి గ్యాంగ్ తుపాకులతో కాల్చి చంపింది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితీష్ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత కరవైందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: దాయాది దేశానికి అమెరికా అధ్యక్షుడు.. సెప్టెంబర్లో పాక్లో పర్యటించనున్న ట్రంప్!
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
చందన్ మిశ్రా.. కరుడుగట్టిన నేరస్థుడు. వైద్యం నిమిత్తం పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు. పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ప్రత్యర్థి వర్గానికి ఐదుగురు సభ్యులు కలిగిన ముఠా ఆస్పత్రిలోని చందన్ మిశ్రా ఉన్న గదిలోకి ప్రవేశించి తుపాకులతో విరుచుకుపడ్డారు. బుల్లెట్లు దూసుకెళ్లడంతో చందన్ మిశ్రా అక్కడికక్కడే చనిపోయాడు. ఇక తుపాకీ శబ్దాలకు రోగులు, బంధువులు హడలెత్తిపోయారు. అనంతరం దుండుగులు అక్కడ నుంచి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయింది.
ఇది కూడా చదవండి: Indore: క్లీన్ సిటీగా ఇండోర్.. వరుసగా 8వ సారి రికార్డ్ సొంతం
బక్సర్ జిల్లా నివాసి అయిన చందన్ మిశ్రా కరుడు గట్టిన నేరస్థుడు. అతడిపై డజన్ల కొద్దీ కేసులున్నాయి. భాగల్పూర్ జైల్లో ఉంటున్నాడు. వైద్య చికిత్స కోసం పెరోల్పై పాట్నా ఆస్పత్రికి వచ్చాడు. అయితే ప్రత్యర్థి వర్గం కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. బాక్సర్ జిల్లా పోలీసుల సాయంతో నిందితులను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కార్తీకాయ్ శర్మ పేర్కొన్నారు. చందన్ మిశ్రా గాయాలతో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. నేరస్థులను పట్టుకుంటామని ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటన దురదృష్టకరమని… దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. నేరస్థులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.

రాష్ట్రంలో ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? అని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ బీహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్దతు ఉన్న నేరస్థులు ఐసీయులోకి చొరబడి ఆసుపత్రిలో చేరిన రోగిని కాల్చి చంపారని ఆరోపించారు. 2005 కి ముందు ఇలా జరిగిందా?” అని ఆయన అడిగారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!