Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Patient Shot Dead In Patna Hospital Before Bihar Assembly Elections

Bihar: ఎన్నికల ముందు మరొక హత్య.. ఆస్పత్రిలో పేషెంట్ కాల్చివేత

Published Date :July 17, 2025 , 2:36 pm
By Suresh Maddala
  • ఎన్నికల ముందు బీహార్‌లో మరొక హత్య
  • ఆస్పత్రిలో పేషెంట్ కాల్చివేత
Bihar: ఎన్నికల ముందు మరొక హత్య.. ఆస్పత్రిలో పేషెంట్ కాల్చివేత
  • Follow Us :
  • google news
  • dailyhunt

అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్‌లో హత్యల పరంపర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న బీజేపీ నేత, వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా ఇంటి దగ్గరే హత్యకు గురయ్యారు. కారులో ఇంటికి చేరిన ఆయన్ను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందు తాజాగా గురువారం ఉదయం పట్టపగలు ఆస్పత్రిలో కరుడుగట్టిన ఒక నేరస్థుడ్ని ప్రత్యర్థి గ్యాంగ్ తుపాకులతో కాల్చి చంపింది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితీష్ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత కరవైందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Trump: దాయాది దేశానికి అమెరికా అధ్యక్షుడు.. సెప్టెంబర్‌లో పాక్‌లో పర్యటించనున్న ట్రంప్!

Also Read

  • Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర క్లారిటీ.. పాత రికార్డులను గుర్తుచేసిన మంత్రిత్వ శాఖ!
  • Rajinikanth: రజినీకాంత్ ఓటు వేస్తుంటే ఈవీఎం వరకు కెమెరాలు.. రికార్డైన 'తలైవా' ఓటు..! అసలేం జరిగింది?
  • Assembly Elections: తమిళనాడు, బెంగాల్‌లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్
  • Bengal Election: బెంగాల్‌లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు

చందన్ మిశ్రా.. కరుడుగట్టిన నేరస్థుడు. వైద్యం నిమిత్తం పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ప్రత్యర్థి వర్గానికి ఐదుగురు సభ్యులు కలిగిన ముఠా ఆస్పత్రిలోని చందన్ మిశ్రా ఉన్న గదిలోకి ప్రవేశించి తుపాకులతో విరుచుకుపడ్డారు. బుల్లెట్లు దూసుకెళ్లడంతో చందన్ మిశ్రా అక్కడికక్కడే చనిపోయాడు. ఇక తుపాకీ శబ్దాలకు రోగులు, బంధువులు హడలెత్తిపోయారు. అనంతరం దుండుగులు అక్కడ నుంచి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయింది.

ఇది కూడా చదవండి: Indore: క్లీన్ సిటీగా ఇండోర్.. వరుసగా 8వ సారి రికార్డ్ సొంతం

బక్సర్ జిల్లా నివాసి అయిన చందన్ మిశ్రా కరుడు గట్టిన నేరస్థుడు. అతడిపై డజన్ల కొద్దీ కేసులున్నాయి. భాగల్పూర్ జైల్లో ఉంటున్నాడు. వైద్య చికిత్స కోసం పెరోల్‌పై పాట్నా ఆస్పత్రికి వచ్చాడు. అయితే ప్రత్యర్థి వర్గం కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. బాక్సర్ జిల్లా పోలీసుల సాయంతో నిందితులను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కార్తీకాయ్ శర్మ పేర్కొన్నారు. చందన్ మిశ్రా గాయాలతో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. నేరస్థులను పట్టుకుంటామని ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటన దురదృష్టకరమని… దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. నేరస్థులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.

11

రాష్ట్రంలో ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? అని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ బీహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్దతు ఉన్న నేరస్థులు ఐసీయులోకి చొరబడి ఆసుపత్రిలో చేరిన రోగిని కాల్చి చంపారని ఆరోపించారు. 2005 కి ముందు ఇలా జరిగిందా?” అని ఆయన అడిగారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bihar Assembly Elections
  • Patient shot dead
  • Patna hospital

తాజావార్తలు

  • Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర క్లారిటీ.. పాత రికార్డులను గుర్తుచేసిన మంత్రిత్వ శాఖ!

  • Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!

  • Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!

  • Tollywood – Bollywood : బాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్స్

  • Ravindra Jadeja: అయ్యబాబోయ్.. కాస్త ఉంటే అభిమానులను కొట్టేలాగా ఉన్నాడే.! వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions