Partition Horrors Remembrance Day: దేశ విభజన.. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నివాళి
Partition Horrors Remembrance Day: భారత దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. వజ్రోత్సవ స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా దేశం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అఖండ భారత్ గా ఉన్న భారతదేశాన్ని బ్రిటిష్ వారి కుటిల నీతితో మత ప్రాతిపదికన భారత్, పాకిస్తాన్ గా విభజించారు. భారత్ కన్నా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 14, 1947లో పాకిస్తాన్ కొత్త రాజ్యంగా ఏర్పడింది. ఆ రోజు స్వాతంత్య్రాన్ని చూస్తామనుకున్న చాలా మంది మతఘర్షణల కారణంగా రక్తపాతాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విభజన గాయాలు ఇన్నేళ్లయిన ఇంకా అలాగే ఉన్నాయి. సరిహద్దులకు ఇరువైపులా భారీ నరమేధం జరిగింది.
Read Also: COVID 19: ఇండియాలో తగ్గిన కరోనా కేసులు.. 15 వేల దిగువకు రోజూవారీ కేసులు
Also Read
- Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ఆగస్టు 14న ‘విభజన్ విభిషిక స్మృతి దివస్’గా జరుపుకుందామని 2021లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఆగస్టు 14న విభజన తాలూకూ గాయాలకు గుర్తుగా.. ఆ ఘర్షణల్లో మరణించిన వారిని నివాళులు అర్పిస్తున్నాము. తాజాగా ఈ రోజు ప్రధాని మోదీ విభజన సమయంలో మరణించిన వారందరికీ నివాళులు అర్పించారు. దేశ విభజన బాధను ఎప్పటికీ మరచిపోలేమని.. నిర్వాసితులైన, ప్రాణాలు కోల్పోయిన ప్రజల పోరాటాన్ని, త్యాగాలను గుర్తు చేసుకునే రోజు అని ప్రధాని అన్నారు. స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగ ప్రయోజనాల కోసం దేశ విభజన, అల్లర్లకు ఎలా దారి తీశాయో మనం ఎప్పటికీ మరిచిపోకూడదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. ఆ సమయంలో జరిగిన ఘోరాలను ఎప్పటికీ మరిచిపోకూడదని అన్నారు.
Today, on #PartitionHorrorsRemembranceDay, I pay homage to all those who lost their lives during Partition , and applaud the resilience as well as grit of all those who suffered during that tragic period of our history.
— Narendra Modi (@narendramodi) August 14, 2022
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!