Partition Horrors Remembrance Day: దేశ విభజన.. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నివాళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Partition Horrors Remembrance Day: భారత దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. వజ్రోత్సవ స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా దేశం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అఖండ భారత్ గా ఉన్న భారతదేశాన్ని బ్రిటిష్ వారి కుటిల నీతితో మత ప్రాతిపదికన భారత్, పాకిస్తాన్ గా విభజించారు. భారత్ కన్నా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 14, 1947లో పాకిస్తాన్ కొత్త రాజ్యంగా ఏర్పడింది. ఆ రోజు స్వాతంత్య్రాన్ని చూస్తామనుకున్న చాలా మంది మతఘర్షణల కారణంగా రక్తపాతాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విభజన గాయాలు ఇన్నేళ్లయిన ఇంకా అలాగే ఉన్నాయి. సరిహద్దులకు ఇరువైపులా భారీ నరమేధం జరిగింది.
Read Also: COVID 19: ఇండియాలో తగ్గిన కరోనా కేసులు.. 15 వేల దిగువకు రోజూవారీ కేసులు
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
ఆగస్టు 14న ‘విభజన్ విభిషిక స్మృతి దివస్’గా జరుపుకుందామని 2021లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఆగస్టు 14న విభజన తాలూకూ గాయాలకు గుర్తుగా.. ఆ ఘర్షణల్లో మరణించిన వారిని నివాళులు అర్పిస్తున్నాము. తాజాగా ఈ రోజు ప్రధాని మోదీ విభజన సమయంలో మరణించిన వారందరికీ నివాళులు అర్పించారు. దేశ విభజన బాధను ఎప్పటికీ మరచిపోలేమని.. నిర్వాసితులైన, ప్రాణాలు కోల్పోయిన ప్రజల పోరాటాన్ని, త్యాగాలను గుర్తు చేసుకునే రోజు అని ప్రధాని అన్నారు. స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగ ప్రయోజనాల కోసం దేశ విభజన, అల్లర్లకు ఎలా దారి తీశాయో మనం ఎప్పటికీ మరిచిపోకూడదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. ఆ సమయంలో జరిగిన ఘోరాలను ఎప్పటికీ మరిచిపోకూడదని అన్నారు.
Today, on #PartitionHorrorsRemembranceDay, I pay homage to all those who lost their lives during Partition , and applaud the resilience as well as grit of all those who suffered during that tragic period of our history.
— Narendra Modi (@narendramodi) August 14, 2022
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!