Partition Horrors Remembrance Day: దేశ విభజన.. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నివాళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Partition Horrors Remembrance Day: భారత దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. వజ్రోత్సవ స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా దేశం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అఖండ భారత్ గా ఉన్న భారతదేశాన్ని బ్రిటిష్ వారి కుటిల నీతితో మత ప్రాతిపదికన భారత్, పాకిస్తాన్ గా విభజించారు. భారత్ కన్నా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 14, 1947లో పాకిస్తాన్ కొత్త రాజ్యంగా ఏర్పడింది. ఆ రోజు స్వాతంత్య్రాన్ని చూస్తామనుకున్న చాలా మంది మతఘర్షణల కారణంగా రక్తపాతాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విభజన గాయాలు ఇన్నేళ్లయిన ఇంకా అలాగే ఉన్నాయి. సరిహద్దులకు ఇరువైపులా భారీ నరమేధం జరిగింది.
Read Also: COVID 19: ఇండియాలో తగ్గిన కరోనా కేసులు.. 15 వేల దిగువకు రోజూవారీ కేసులు
Also Read
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
ఆగస్టు 14న ‘విభజన్ విభిషిక స్మృతి దివస్’గా జరుపుకుందామని 2021లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఆగస్టు 14న విభజన తాలూకూ గాయాలకు గుర్తుగా.. ఆ ఘర్షణల్లో మరణించిన వారిని నివాళులు అర్పిస్తున్నాము. తాజాగా ఈ రోజు ప్రధాని మోదీ విభజన సమయంలో మరణించిన వారందరికీ నివాళులు అర్పించారు. దేశ విభజన బాధను ఎప్పటికీ మరచిపోలేమని.. నిర్వాసితులైన, ప్రాణాలు కోల్పోయిన ప్రజల పోరాటాన్ని, త్యాగాలను గుర్తు చేసుకునే రోజు అని ప్రధాని అన్నారు. స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగ ప్రయోజనాల కోసం దేశ విభజన, అల్లర్లకు ఎలా దారి తీశాయో మనం ఎప్పటికీ మరిచిపోకూడదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. ఆ సమయంలో జరిగిన ఘోరాలను ఎప్పటికీ మరిచిపోకూడదని అన్నారు.
Today, on #PartitionHorrorsRemembranceDay, I pay homage to all those who lost their lives during Partition , and applaud the resilience as well as grit of all those who suffered during that tragic period of our history.
— Narendra Modi (@narendramodi) August 14, 2022
తాజావార్తలు
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
ట్రెండింగ్
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!