Partition Horrors Remembrance Day: దేశ విభజన.. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నివాళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Partition Horrors Remembrance Day: భారత దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. వజ్రోత్సవ స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా దేశం ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అఖండ భారత్ గా ఉన్న భారతదేశాన్ని బ్రిటిష్ వారి కుటిల నీతితో మత ప్రాతిపదికన భారత్, పాకిస్తాన్ గా విభజించారు. భారత్ కన్నా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 14, 1947లో పాకిస్తాన్ కొత్త రాజ్యంగా ఏర్పడింది. ఆ రోజు స్వాతంత్య్రాన్ని చూస్తామనుకున్న చాలా మంది మతఘర్షణల కారణంగా రక్తపాతాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విభజన గాయాలు ఇన్నేళ్లయిన ఇంకా అలాగే ఉన్నాయి. సరిహద్దులకు ఇరువైపులా భారీ నరమేధం జరిగింది.
Read Also: COVID 19: ఇండియాలో తగ్గిన కరోనా కేసులు.. 15 వేల దిగువకు రోజూవారీ కేసులు
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ఆగస్టు 14న ‘విభజన్ విభిషిక స్మృతి దివస్’గా జరుపుకుందామని 2021లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఆగస్టు 14న విభజన తాలూకూ గాయాలకు గుర్తుగా.. ఆ ఘర్షణల్లో మరణించిన వారిని నివాళులు అర్పిస్తున్నాము. తాజాగా ఈ రోజు ప్రధాని మోదీ విభజన సమయంలో మరణించిన వారందరికీ నివాళులు అర్పించారు. దేశ విభజన బాధను ఎప్పటికీ మరచిపోలేమని.. నిర్వాసితులైన, ప్రాణాలు కోల్పోయిన ప్రజల పోరాటాన్ని, త్యాగాలను గుర్తు చేసుకునే రోజు అని ప్రధాని అన్నారు. స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగ ప్రయోజనాల కోసం దేశ విభజన, అల్లర్లకు ఎలా దారి తీశాయో మనం ఎప్పటికీ మరిచిపోకూడదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. ఆ సమయంలో జరిగిన ఘోరాలను ఎప్పటికీ మరిచిపోకూడదని అన్నారు.
Today, on #PartitionHorrorsRemembranceDay, I pay homage to all those who lost their lives during Partition , and applaud the resilience as well as grit of all those who suffered during that tragic period of our history.
— Narendra Modi (@narendramodi) August 14, 2022
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!