Lok Sabha: బడ్జెట్ సమావేశాలు షురూ.. వక్ఫ్బోర్డు బిల్లుతో సహా 16 బిల్లులు.. ఏవేవంటే..!
- శుక్రవారం నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- ఫిబ్రవరి 1న బడ్జె్ట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
- ఈ సమావేశాల్లో 16 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. అలాగే ఇటీవల చనిపోయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సంతాపం తెలియజేయనున్నారు. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సమావేశాలు కూడా వాడీవేడిగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత శీతాకాల సమావేశాలు హాట్హాట్గా సాగాయి. అదానీ లంచాల వ్యవహారంతో ఉభయ సభలు అట్టుడికాయి. ఈ బడ్జెట్ సమావేశాలు కూడా అదే మాదిరిగా ఉండనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: GHMC Council : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస
Also Read
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ఇదిలా ఉంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలు జరుగుతున్నాయి. మొదటి సెషన్ ఫిబ్రవరి 13 వరకు జరుగుతుండగా.. రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల్లో దాదాపు 16 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంతో సహా 16 బిల్లులు బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టనన్నారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ఎనిమిదో సారి శనివారం సమర్పించనున్నారు.
ఇక 2024-25 ఆర్థిక సర్వేను శుక్రవారం నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్నారు. అలాగే సమావేశాల్లో ఫైనాన్స్ బిల్లు 2025, వక్ఫ్, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ చట్టానికి సవరణలు, భారతీయ రైల్వేలు, భారతీయ రైల్వే బోర్డు చట్టాల విలీనంతో సహా 16 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. అలాగే విపత్తు నిర్వహణ మరియు చమురు క్షేత్రాల చట్టాలకు సవరణలు చేసే అవకాశం ఉన్నాయి. తీరప్రాంత మరియు మర్చంట్ షిప్పింగ్కు సంబంధించిన బిల్లులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్కు త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంగా పేరు మార్చాలని.. దానిని ‘‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ’గా ప్రకటించాలని కోరుతూ మరొక బిల్లును కూడా సమర్పించవచ్చు. ఇక విమానయాన రంగానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు.. ఇమ్మిగ్రేషన్ మరియు విదేశీయుల ప్రవేశానికి సంబంధించిన ప్రస్తుత నిబంధనలను మార్చడానికి ఉద్దేశించిన బిల్లులు కూడా ఈ సెషన్లో ప్రవేశపెట్టే ఛాన్సుంది. చివరగా గోవా రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణం ఆశించిన మరో కీలక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: UK: బ్రిటన్ “ఇస్లామిక్ దేశం”గా మారొచ్చు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్పాల్ యాదవ్పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!