Pappu Yadav: ‘‘లారెన్స్ బిష్ణోయ్’’ ప్రకటనతో నాకు సంబంధం లేదు.. పప్పూ యాదవ్ భార్య..
- లారెన్స్ బిష్ణోయ్పై ఎంపీ పప్పూ యాదవ్ వ్యాఖ్యలు..
- పప్పూ యాదవ్ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్న భార్య..
- గత కొంత కాలంగా విడిగా ఉంటున్న ఎంపీ రంజీత్ రంజన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pappu Yadav: ఇటీవల కాలంలో బీహార్ పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ దేశవ్యాప్తంగా ట్రెడింగ్ అవుతున్నాడు. ముంబైలో ఎన్సీపీ మాజీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ని చంపిన తర్వాత, ప్రభుత్వం అనుమతి ఇస్తే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నెట్వర్క్ని 24 గంటలో తుదిచిపెడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి పప్పూ యాదవ్కి ఫోన్ రావడంతో తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని వేడుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే, పప్పూ యాదవ్ భార్య మాట్లాడుతూ.. తన భర్త చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని అన్నారు. కొంత కాలంగా పప్పూ యాదవ్తో విడిపోయి ఉంటున్న అతని భార్య రంజీత్ రంజన్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం బిష్ణోయ్ కమ్యూనిటీ ఎంతో పవిత్రంగా భావించే కృష్ణజింకల్ని చంపడంపై సల్మాన్ ఖాన్కి పప్పూ యాదవ్ సంఘీభావం ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే పప్పూ యాదవ్ ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నాడు.
Also Read
- Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
- Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
- Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
Read Also: Delhi: పావురాల దాణా నిషేధానికి ఢిల్లీ సర్కార్ ఫ్లాన్! కారణమిదే!
అతని భార్య రంజీత్ రంజన్ మాట్లాడుతూ.. ‘‘పప్పు జీ,నాకు వేర్వేరు రాజకీయాలు ఉన్నాయి, మా మధ్య విభేదాలు ఉన్నాయి. గత ఒకటిన్నర లేదా రెండు సంవత్సరాలుగా మేము విడిగా ఉంటున్నాము’’ అని చెప్పారు. అతను ఏ ప్రకటన చేసినా, నాకు నా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. ఈ పరిణామాలను శాంతిభద్రతల విషయంగా పేర్కొన్న ఆమె, ప్రభుత్వం దీనిని పరిశీలించాలని కోరారు.
అంతకుముందు, బాబా సిద్ధిక్ మరణం తర్వాత పప్పూ యాదవ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ముంబై నుంచి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా సల్మాన్ ఖాన్ని కలవలేకపోయానని చెప్పాడు. ఆ తర్వాత తనకు 24 గంటల సమయం ఇస్తే బిష్ణోయ్ గ్యాంగ్ లేకుండా చేస్తానని అన్నారు. ఆ తర్వాత నుంచి వరసగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి పప్పూ యాదవ్ బెదిరింపులు ఎదుర్కొంటున్నాడు. ఈ మేరకు తనకు ఉన్న వై సెక్యూరిటీని, జెడ్ సెక్యూరిటీకి అప్గ్రేడ్ చేయాలని కోరాడు. పోలీస్ ఎస్కార్ట్ కావాలని డిమాండ్ చేశాడు. నేను హత్యకు గురైతే ఆ నింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పడుతుందని అన్నారు.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ఆకలి తీరుస్తుందా?
-
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
-
Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
-
Ram Charan : అందుకే నేను నాబాడీగార్డును అస్సలు బయట తిరగనివ్వట్లేదు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్
-
Vijay Mallya: ఆర్సీబీ హిస్టారికల్ విన్పై విజయ్ మాల్యా క్రేజీ ట్వీట్.. ఏమన్నారంటే..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!