Pakistan: పాకిస్తాన్లో భయాందోళన.. గగనతల ఆంక్షలు, సిద్ధంగా నేవీ నౌకలు..
- పాకిస్తాన్తో తీవ్ర భయాందోళన..
- కరాచీలో సిద్ధంగా నేవీ నౌకలు..
- గగనతలంపై ఆంక్షలు, 50 శాతానికి విమాన సేవలు..
- భారత దాడిని ధీటుగా ఎదుర్కొంటామని ప్రగల్భాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే దౌత్యపరంగా భారత్ పాకిస్తాన్కి షాక్లు ఇస్తోంది. పాక్ ప్రాణాధారమైన ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసి, దేశంలో ఉంటున్న పాకిస్థానీలను వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్పై చర్యల విషయంలో భారత త్రివిధ దళాలకు ప్రధాని మోడీ పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. టైమ్, టార్గెట్, ప్లేస్ సైన్యమే చూసుకోవాలని చెప్పారు.
ఇదిలా ఉంటే, ఈ నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఇప్పటికే సంక్షోభాన్ని నివారించేలా ప్రపంచదేశాలను పాక్ కోరుతోంది. మరోవైపు, పాక్ వ్యాప్తంగా భయాందోళనలు నెలకున్నాయి. భారత దాడిని అడ్డుకునేందుకు పాక్ యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో సహా నేవీ నౌకల్ని కరాచీలోని నౌకాశ్రయంలో మోహరించింది. తాము భారత దాడిని ఎదుర్కోగలమని పాక్ సైనిక వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ తన పౌర విమానాల కార్యకలాపాలను 50 శాతానికి తగ్గించింది. గగనతలంలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా అవసరమైన కార్యకలాపాలను మాత్రమే నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Also Read
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
Read Also: CRPF: సీఆర్పీఎఫ్ ఆపరేషన్ విజయవంతం.. కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు..!
పాకిస్తాన్ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అత్తౌల్లాతరార్ మాట్లాడుతూ.. భారత్ రాబోయే 24-36 గంటల్లో తమ దేశంపై సైనిక చర్య ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. పహల్గామ్ సంఘటనలో తమ ప్రమేయం ఉందని భారత్ కల్పిత ఆరోపణలు చేస్తోందని చెప్పారు. పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే అని చెప్పారు. తటస్థ దర్యాప్తుని పాకిస్తాన్ కోరుతోందని, అందుకు సహకరిస్తోందని చెప్పారు. ఇప్పటికే ఈ విషయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు.
మరోవైపు, పాకిస్తాన్ ప్రధాని సంక్షోభాన్ని నివారించాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ అంటోనియో గుటెర్రస్తో ఫోన్లో మాట్లాడారు. పాకిస్తాన్ అన్ని రకాల ఉగ్రవాదాలను తిరస్కరిస్తుందని, పహల్గామ్ దాడిపై భారత్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని అన్నారు. పహల్గామ్ సంఘటనపై పారదర్శక, తటస్థ దర్యాప్తుకు పిలుపునిచ్చారు. పాకిస్తాన్ శాంతికి కట్టుబడి ఉందని చెబుతూనే, దాడి చేస్తే పూర్తి శక్తితో ఎదుర్కొంటామని షరీఫ్ తన ఎక్స్లో పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Jantar Mantar Protest: జంతర్మంతర్లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
-
Vande Mataram Bill 2026: ‘వందేమాతరం’పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్