Same Gender Marriage: గే కమ్యూనిటీ సమస్యలపై కమిటీ ఏర్పాటు.. సుప్రీంకు తెలియజేసిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Same Gender Marriage: సెమ్ సెక్స్ మ్యారేజ్ అంశాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ అంశంపై కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య వాడీవేడీ వాదనలు జరుగున్నాయి. స్వలింగ వివాహాల విషయంలో ఆ జంటలు తమ హక్కులను కోల్పోతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే LGBTQIA+ కమ్యూనిటీ ఆందోళనల్ని పరిశీలించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు ఈ రోజు తెలిపింది. ఈ రోజు విచారణలో కేంద్రం తరుపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..కేంద్రం ఏర్పాటు చేయబోయే కమిటీకి కేబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారని తెలిపారు.
Read Also: KTR Warangal Tour: కేటీఆర్ వరంగల్ పర్యటన.. క్లారిటీ ఇచ్చిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. ఈ అంశంపై గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ కేసులో కొన్ని రోజుల క్రితం కేంద్రానికి సుప్రీంకోర్టు పలు కీలక సూచనలు చేసింది. స్వలింగ జంటల ప్రాథమిక, సామాజిక హక్కులను కల్పించే విషయంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుక్కోవాలని కోరింది. గే జంటలకు ఉమ్మడి బ్యాంక్ అకౌంట్స్ కల్పించడం, బీమా పాలసీల్లో భాగస్వామిని నామినేట్ చేసే అంశాలపై కేంద్ర స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలపింది. దీంతో పాటు స్వలింగ వివాహాల చట్టబద్ధతపై పార్లమెంట్ లో చర్చ జరగడం కీలకం అని గతంలో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే సేమ్ సెక్స్ వివామాల్లో చట్టబద్ధత కల్పించకుండా వాళ్ల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని ఏప్రిల్ 27న విచారణలో ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది.
వివాహాల చట్టబద్ధత అనే అంశం పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, దీనిపై కోర్టులు కలుగచేసుకోవద్దని కేంద్రం గతంలో వ్యాఖ్యానించింది. కొన్ని పట్టణ సంపన్నవర్గాల్లో మాత్రమే ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ కనిపిస్తోందని, ఇది భారతీయ సమాజానికి విరుద్ధం అని కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో విస్తృత ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఈ కేసును సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ కె కౌల్, జస్టిస్ ఎస్ ఆర్ భట్, జస్టిస్ హిమా కోహ్లీ మరియు జస్టిస్ పిఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.
తాజావార్తలు
-
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
-
Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..