Rajastan: కన్యత్వ పరీక్షలో వధువు విఫలం.. కుటుంబసభ్యులకు రూ.10 లక్షల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajastan: టెక్నాలజీ పరంగా దేశం ఎంత అభివృద్ధి చెందినా కొందరిలో మాత్రం ఇప్పటికీ మార్పు రావడం లేదు. అమ్మాయిల పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో వివాహం తర్వాత వధువుకు నిర్వహించిన కన్యత్వ పరీక్షలో విఫలమవడంతో అత్తమామలు ఆమెను విడిచిపెట్టారు. ఇది చాలదన్నట్లుగా, వారు ఈ విషయంలో పంచాయతీ కూడా పిలిచారు. అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల జరిమానా విధించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో బాలికతోపాటు కుటుంబసభ్యులను కూడా అత్తమామలు వేధించారు.
భిల్వారా నగరంలో నివసిస్తున్న 24 ఏళ్ల యువతికి మే 11, 2022న బాగోర్లో వివాహం జరిగిందని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అయూబ్ ఖాన్ నివేదించారు. వివాహం తర్వాత, ఆమె సమాజంలోని ‘కుక్డీ’ విధానంలో ఆమె కన్యత్వ పరీక్ష జరిగింది. ఆమె పాస్ కాలేదు. ఆమెను విచారించగా.. పెళ్లికి ముందే ఆమె పొరుగున ఉండే ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది. ఈ విషయం తెలుసుకున్న భర్త, అత్తగారు ఆమెను కొట్టారు. ఆ తర్వాత బాగోర్లోని భాదు మాత ఆలయంలో అత్తమామల తరపున సొసైటీ పంచాయితీ జరిగింది.పంచాయితీలో బాలిక కుటుంబ సభ్యులు మే 18న సుభాష్ నగర్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదు చేయాలని తెలియజేశారు. అయితే ఆ సమయంలో పంచాయతీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు మే 31న ఆ గ్రామంలో మరోసారి పంచాయతీ నిర్వహించారు. పరిహారం పేరుతో వధువు, ఆమె కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా విధించారు. ఆ డబ్బులు చెల్లించనందుకు వధువుతోపాటు ఆమె కుటుంబాన్ని అత్తింటి వారు వేధించారు. నూతన వధువును ఆమె పుట్టింటికి పంపారు. వధువు కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరిపారు. వారు చెప్పింది నిజమని తేలడంతో వధువు భర్త, మామపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి అయూబ్ ఖాన్ తెలిపారు.
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
Hyderabad: ట్రాఫిక్ క్లియరెన్స్ కంటే ఛలాన్ వేయడమే పోలీసులకు ముఖ్యమా?
సాంసీ సమాజంలో “కుక్డీ” విధానమనేది రాజస్థాన్లో ఆచారం. ఈ అభ్యాసం ప్రకారం మహిళలు తమ “స్వచ్ఛత” అంటే కన్యత్వానికి రుజువు ఇవ్వాలి. పెళ్లి రాత్రి, భర్త తన భార్యకు తెల్లటి షీట్ తెస్తాడు. అతను శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు, ఆ షీట్ మీద ఉన్న రక్తపు గుర్తు మరుసటి రోజు సమాజంలోని ప్రజలకు చూపబడుతుంది. రక్తం జాడలు ఉంటే, అతని భార్య పవిత్రంగా పరిగణించబడుతుంది. ఆ షీట్పై రక్తపు జాడ లేకుంటే, కమ్యూనిటీ పంచాయతీ అమ్మాయి కుటుంబం నుండి మరింత కట్నం డిమాండ్ చేస్తుంది.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!