Rajastan: కన్యత్వ పరీక్షలో వధువు విఫలం.. కుటుంబసభ్యులకు రూ.10 లక్షల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajastan: టెక్నాలజీ పరంగా దేశం ఎంత అభివృద్ధి చెందినా కొందరిలో మాత్రం ఇప్పటికీ మార్పు రావడం లేదు. అమ్మాయిల పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో వివాహం తర్వాత వధువుకు నిర్వహించిన కన్యత్వ పరీక్షలో విఫలమవడంతో అత్తమామలు ఆమెను విడిచిపెట్టారు. ఇది చాలదన్నట్లుగా, వారు ఈ విషయంలో పంచాయతీ కూడా పిలిచారు. అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల జరిమానా విధించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో బాలికతోపాటు కుటుంబసభ్యులను కూడా అత్తమామలు వేధించారు.
భిల్వారా నగరంలో నివసిస్తున్న 24 ఏళ్ల యువతికి మే 11, 2022న బాగోర్లో వివాహం జరిగిందని పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అయూబ్ ఖాన్ నివేదించారు. వివాహం తర్వాత, ఆమె సమాజంలోని ‘కుక్డీ’ విధానంలో ఆమె కన్యత్వ పరీక్ష జరిగింది. ఆమె పాస్ కాలేదు. ఆమెను విచారించగా.. పెళ్లికి ముందే ఆమె పొరుగున ఉండే ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది. ఈ విషయం తెలుసుకున్న భర్త, అత్తగారు ఆమెను కొట్టారు. ఆ తర్వాత బాగోర్లోని భాదు మాత ఆలయంలో అత్తమామల తరపున సొసైటీ పంచాయితీ జరిగింది.పంచాయితీలో బాలిక కుటుంబ సభ్యులు మే 18న సుభాష్ నగర్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదు చేయాలని తెలియజేశారు. అయితే ఆ సమయంలో పంచాయతీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు మే 31న ఆ గ్రామంలో మరోసారి పంచాయతీ నిర్వహించారు. పరిహారం పేరుతో వధువు, ఆమె కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా విధించారు. ఆ డబ్బులు చెల్లించనందుకు వధువుతోపాటు ఆమె కుటుంబాన్ని అత్తింటి వారు వేధించారు. నూతన వధువును ఆమె పుట్టింటికి పంపారు. వధువు కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరిపారు. వారు చెప్పింది నిజమని తేలడంతో వధువు భర్త, మామపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి అయూబ్ ఖాన్ తెలిపారు.
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
Hyderabad: ట్రాఫిక్ క్లియరెన్స్ కంటే ఛలాన్ వేయడమే పోలీసులకు ముఖ్యమా?
సాంసీ సమాజంలో “కుక్డీ” విధానమనేది రాజస్థాన్లో ఆచారం. ఈ అభ్యాసం ప్రకారం మహిళలు తమ “స్వచ్ఛత” అంటే కన్యత్వానికి రుజువు ఇవ్వాలి. పెళ్లి రాత్రి, భర్త తన భార్యకు తెల్లటి షీట్ తెస్తాడు. అతను శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు, ఆ షీట్ మీద ఉన్న రక్తపు గుర్తు మరుసటి రోజు సమాజంలోని ప్రజలకు చూపబడుతుంది. రక్తం జాడలు ఉంటే, అతని భార్య పవిత్రంగా పరిగణించబడుతుంది. ఆ షీట్పై రక్తపు జాడ లేకుంటే, కమ్యూనిటీ పంచాయతీ అమ్మాయి కుటుంబం నుండి మరింత కట్నం డిమాండ్ చేస్తుంది.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!