Pakistan: “ఢిల్లీ ఘటన సిలిండర్ పేలుడు మాత్రమే”.. పాక్ రక్షణ మంత్రి మాటల్లో భయం..
- ఢిల్లీ ఘటన కేవలం గ్యాస్ సిలిండర్ పేలుడు మాత్రమే..
- రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ దీనిని వాడుకుంటోంది..
- పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాటల్లో భయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారతదేశంలో ఎప్పుడు ఉగ్రవాద దాడి జరిగిన, దాని మూలాలు పాకిస్తాన్లోనే ఉంటాయి. అయితే, ఈ నిజాన్ని ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఒప్పుకోదు. తమ ప్రమేయం లేదని చెబుతుంటుంది. ఈసారి కూడా అదే ప్రయత్నం చేసింది. ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ను తక్కువ చేసేలా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ ఉగ్రదాడి గురించి స్పందిస్తూ.. ‘‘గ్యాస్ సిలిండర్ పేలుడు’’గా ఆసిఫ్ అభివర్ణించారు. భారత్ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని వాడుకుంటోందని ఆరోపించారు.
Read Also: Donald Trump: ‘‘నీకు ఎంత మంది భార్యలు’’.. దేశాధ్యక్షుడిని అడిగిన ట్రంప్..
Also Read
- Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
- Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Ketan Murder Case: కేతన్ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
పాకిస్తాన్లోని ఒక టీవీ షో సందర్భంగా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ కార్ బాంబ్ దాడికి ఉగ్రవాద దాడికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయని భద్రతా సంస్థలు నిర్ధారించాయి. దీనిపై ఆసిఫ్ మాట్లాడుతూ.. ‘‘ నిన్నటి వరకు ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటన. కానీ ఇప్పుడు వారు దానిని విదేశీ కుట్రగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని అన్నారు. ‘‘రాబోయే కొన్ని గంటల్లో లేదా రేపు, భారతదేశం మాపై దురాక్రమణ చేసినా, మాపై ఆరోపణలు చేసినా నేను ఆశ్చర్యపోను’’ అని అన్నారు. పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలతో ఆయనలోని భయం స్పష్టంగా తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. గతంలో పుల్వామా, ఉరి, ముంబై దాడులు జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ ఇలాగే తమ ప్రమేయం లేదని చెప్పుకుంది. ఢిల్లీ దాడి ఉగ్రవాద ఘటనే అని కేంద్రం స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ మాడ్యుల్తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
-
Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
-
Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
-
Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
-
BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!