BSF Raising Day: బీఎస్ఎఫ్ ఇచ్చిన స్వీట్లను నిరాకరించిన పాకిస్తాన్ జవాన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Border Guarding Force personnel refuses to accept sweets on BSF Raising Day: ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన సరిహద్దుల్లో ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులు ఒకటి. అయితే ఇరు దేశాల మధ్య ఎన్ని వైషమ్యాలు ఉన్నా.. బోర్డర్ లోని ఇరు దేశాల జవాన్లు పండగల సమయంలో, జాతీయ దినోత్సవాల సమయంలో స్వీట్లు పంచుకుంటారు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న సంప్రదాయం. అయితే బీఎస్ఎఫ్ రైజింగ్ డే సందర్భంగా భారత జవాన్లు స్వీట్లను పంచితే తీసుకోవడానికి మాత్రం పాకిస్తాన్ జవాన్లు నిరాకరించారు.
ఇటీవల ఈద్, దీపావళి సమయాల్లో ఇరు దేశాల సైనికులు, ఇరు దేశాల సరిహద్దుల్లోని అన్ని బెటాలియన్లు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్( బీఎస్ఎఫ్) రైజింగ్ డే సమయంలో మాత్రం భారత జవాన్లు ఇచ్చిన స్వీట్లను తీసుకునేందుకు అంగీకరించలేదు. సాధారణంగా రైజింగ్ డే సందర్భంగా పాకిస్తాన్ బోర్డర్ గార్డ్ ఫోర్స్(బీజీఎఫ్) సిబ్బందికి స్వీట్లను అందించడం ఓ సంప్రదాయం. కానీ గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాత్రం స్వీట్లను తీసుకోలేదని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. అయితే తాము స్వీట్లను తీసుకోవాలని పై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదని బీజీఎఫ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: Delhi: మరో లివ్ ఇన్ రిలేషన్ కేసు..శ్రద్ధా తరహాలో మహిళ హత్య..
మనదేశంలో సరిహద్దులను రక్షించేందుకు బీఎస్ఎఫ్ తో కూడిన రక్షణ దళం ఉంటుంది. ఇది స్వతంత్ర సంస్థగా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి స్వతంత్ర కేడర్ ఉంటుంది. అయితే పాకిస్తాన్ సరిహద్దు రక్షణ దళంలో ఇలా ఉండదు. సాధారణంగా పాకిస్తాన్ సైన్యం నుంచి డిఫ్యూటేషన్ పై వచ్చిన వారే దీన్ని నిర్వహిస్తుంటారు. అయితే ఇటీవల భారత్ అంటే బద్ధ శతృవుగా చూసే అసిమ్ మునీర్ పాక్ సైన్యాధ్యక్షుడిగా నవంబర్ 29న బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చిన తర్వాతే ఇలా జరిగిందని తెలుస్తోంది.
భారత్ సరిహద్దులను కాపాడే సంస్థగా ఉంది బీఎస్ఎఫ్. డిసెంబర్1, 1965న స్థాపించబడింది. 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఈ దళం బాగా పనిచేసింది. బీఎస్ఎఫ్ మహావీర్ చక్ర, వీర్ చక్ర వంటి అత్యున్నత శౌర్య పురస్కాలను అందుకుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!