Ashwini Vaishnaw: రాబోయే కాలంలో 1000కి పైగా అమృత్ భారత్ రైళ్లు.. గంటకు 250 కి.మీతో నడిచే రైళ్ల తయారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwini Vaishnaw: రాబోయే కొన్ని ఏళ్లలో భారతదేశంలో కనీసం 1000 కొత్త తరం ‘అమృత్ భారత్ ట్రైన్’లను తయారు చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. గంటకు 250 కి.మీ వేగంతో నడిచే రైళ్లను తయారు చేయడానికి పనులు జరుగుతున్నాయని శనివారం తెలిపారు. వందేభారత్ రైళ్ల ఎగుమతిపై ఇప్పటికే పనులు ప్రారంభించామని, వచ్చే ఐదేళ్లలో తొలి ఎగుమతి జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోడీ హయాంలో రైల్వేల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన(చినాబ్ వంతెన), మొదటి అందర్ రివర్ వాటర్ టన్నెల్(కోల్కతా మెట్రో) వంటి సాంకేతిక పురోగతులు సాధ్యమయ్యాయని అన్నారు.
Read Also: BJP: తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే..
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్లో భాగంగా ముంబై-థానే మధ్య దేశంలోనే మొట్టమొదటి సముద్రగర్భ టన్నెల్ నిర్మాణం ప్రారంభంపై మాట్లాడుతూ.. ప్రపంచంలోనే 5 దేవాలు మాత్రమే ఇలాంటి సాంకేతికత కలిగి ఉన్నాయని చెప్పారు. తాము ప్రపంచ స్థాయి రైలుగా అమృత్ భారత్ని రూపొందించామని, కేవలం రూ. 454 ధరతో 1000 కి.మీ ప్రయాణాన్ని అందిస్తున్నామని చెప్పారు. 10 క్రితంతో పోలిస్తే ప్రస్తుతం రైల్వే స్టేషన్లు భిన్నంగా ఉన్నాయని, పరిశుభ్రంగా మారాయని అన్నారు. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడంతో యువతలో వందే భారత్ వంటి రైళ్లు బాగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు.
గతేడాది 5200 కిలోమీటర్ల కొత్త ట్రాక్ ఏర్పాటు చేశామని, ఈ ఏడాది 5500 కి.మీ కొత్త ట్రాక్ ఏర్పాటు చేస్తామని, గత 10 ఏళ్లలో రైల్వే ప్రయాణికుల భద్రత కోసం రూ.1.75 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిందని వెల్లడించారు. ప్రతీ ఏడాది దాదాపుగా 7000 కి.మీ అరిగిపోయిన ట్రాక్లను మారుస్తున్నట్లు చెప్పారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ జాప్యానికి మహారాష్ట్రలోని గత ప్రభుత్వమే కారణమని అశ్విని వైష్ణవ్ అన్నారు. వాపి నుంచి అహ్మదాబాద్ వరకు గుజరాత్ సెక్షన్ పనులు వేగంగా జరిగాయని, అయితే అప్పటి ఠాక్రే ప్రభుత్వం ముంబాయి నుంచి వాపి సెక్షన్ పనులకు అనుమతి ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!