Ashwini Vaishnaw: రాబోయే కాలంలో 1000కి పైగా అమృత్ భారత్ రైళ్లు.. గంటకు 250 కి.మీతో నడిచే రైళ్ల తయారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwini Vaishnaw: రాబోయే కొన్ని ఏళ్లలో భారతదేశంలో కనీసం 1000 కొత్త తరం ‘అమృత్ భారత్ ట్రైన్’లను తయారు చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. గంటకు 250 కి.మీ వేగంతో నడిచే రైళ్లను తయారు చేయడానికి పనులు జరుగుతున్నాయని శనివారం తెలిపారు. వందేభారత్ రైళ్ల ఎగుమతిపై ఇప్పటికే పనులు ప్రారంభించామని, వచ్చే ఐదేళ్లలో తొలి ఎగుమతి జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోడీ హయాంలో రైల్వేల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన(చినాబ్ వంతెన), మొదటి అందర్ రివర్ వాటర్ టన్నెల్(కోల్కతా మెట్రో) వంటి సాంకేతిక పురోగతులు సాధ్యమయ్యాయని అన్నారు.
Read Also: BJP: తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే..
Also Read
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్లో భాగంగా ముంబై-థానే మధ్య దేశంలోనే మొట్టమొదటి సముద్రగర్భ టన్నెల్ నిర్మాణం ప్రారంభంపై మాట్లాడుతూ.. ప్రపంచంలోనే 5 దేవాలు మాత్రమే ఇలాంటి సాంకేతికత కలిగి ఉన్నాయని చెప్పారు. తాము ప్రపంచ స్థాయి రైలుగా అమృత్ భారత్ని రూపొందించామని, కేవలం రూ. 454 ధరతో 1000 కి.మీ ప్రయాణాన్ని అందిస్తున్నామని చెప్పారు. 10 క్రితంతో పోలిస్తే ప్రస్తుతం రైల్వే స్టేషన్లు భిన్నంగా ఉన్నాయని, పరిశుభ్రంగా మారాయని అన్నారు. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడంతో యువతలో వందే భారత్ వంటి రైళ్లు బాగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు.
గతేడాది 5200 కిలోమీటర్ల కొత్త ట్రాక్ ఏర్పాటు చేశామని, ఈ ఏడాది 5500 కి.మీ కొత్త ట్రాక్ ఏర్పాటు చేస్తామని, గత 10 ఏళ్లలో రైల్వే ప్రయాణికుల భద్రత కోసం రూ.1.75 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిందని వెల్లడించారు. ప్రతీ ఏడాది దాదాపుగా 7000 కి.మీ అరిగిపోయిన ట్రాక్లను మారుస్తున్నట్లు చెప్పారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ జాప్యానికి మహారాష్ట్రలోని గత ప్రభుత్వమే కారణమని అశ్విని వైష్ణవ్ అన్నారు. వాపి నుంచి అహ్మదాబాద్ వరకు గుజరాత్ సెక్షన్ పనులు వేగంగా జరిగాయని, అయితే అప్పటి ఠాక్రే ప్రభుత్వం ముంబాయి నుంచి వాపి సెక్షన్ పనులకు అనుమతి ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?