Ashwini Vaishnaw: రాబోయే కాలంలో 1000కి పైగా అమృత్ భారత్ రైళ్లు.. గంటకు 250 కి.మీతో నడిచే రైళ్ల తయారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwini Vaishnaw: రాబోయే కొన్ని ఏళ్లలో భారతదేశంలో కనీసం 1000 కొత్త తరం ‘అమృత్ భారత్ ట్రైన్’లను తయారు చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. గంటకు 250 కి.మీ వేగంతో నడిచే రైళ్లను తయారు చేయడానికి పనులు జరుగుతున్నాయని శనివారం తెలిపారు. వందేభారత్ రైళ్ల ఎగుమతిపై ఇప్పటికే పనులు ప్రారంభించామని, వచ్చే ఐదేళ్లలో తొలి ఎగుమతి జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోడీ హయాంలో రైల్వేల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన(చినాబ్ వంతెన), మొదటి అందర్ రివర్ వాటర్ టన్నెల్(కోల్కతా మెట్రో) వంటి సాంకేతిక పురోగతులు సాధ్యమయ్యాయని అన్నారు.
Read Also: BJP: తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే..
Also Read
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్లో భాగంగా ముంబై-థానే మధ్య దేశంలోనే మొట్టమొదటి సముద్రగర్భ టన్నెల్ నిర్మాణం ప్రారంభంపై మాట్లాడుతూ.. ప్రపంచంలోనే 5 దేవాలు మాత్రమే ఇలాంటి సాంకేతికత కలిగి ఉన్నాయని చెప్పారు. తాము ప్రపంచ స్థాయి రైలుగా అమృత్ భారత్ని రూపొందించామని, కేవలం రూ. 454 ధరతో 1000 కి.మీ ప్రయాణాన్ని అందిస్తున్నామని చెప్పారు. 10 క్రితంతో పోలిస్తే ప్రస్తుతం రైల్వే స్టేషన్లు భిన్నంగా ఉన్నాయని, పరిశుభ్రంగా మారాయని అన్నారు. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడంతో యువతలో వందే భారత్ వంటి రైళ్లు బాగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు.
గతేడాది 5200 కిలోమీటర్ల కొత్త ట్రాక్ ఏర్పాటు చేశామని, ఈ ఏడాది 5500 కి.మీ కొత్త ట్రాక్ ఏర్పాటు చేస్తామని, గత 10 ఏళ్లలో రైల్వే ప్రయాణికుల భద్రత కోసం రూ.1.75 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిందని వెల్లడించారు. ప్రతీ ఏడాది దాదాపుగా 7000 కి.మీ అరిగిపోయిన ట్రాక్లను మారుస్తున్నట్లు చెప్పారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ జాప్యానికి మహారాష్ట్రలోని గత ప్రభుత్వమే కారణమని అశ్విని వైష్ణవ్ అన్నారు. వాపి నుంచి అహ్మదాబాద్ వరకు గుజరాత్ సెక్షన్ పనులు వేగంగా జరిగాయని, అయితే అప్పటి ఠాక్రే ప్రభుత్వం ముంబాయి నుంచి వాపి సెక్షన్ పనులకు అనుమతి ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!