టీనేజర్ల జోష్.. 3 రోజుల్లోనే 1.24 కోట్ల మందికి వ్యాక్సిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ భారత్ కదులుతోంది.. వ్యాక్సినేషన్ సెంటర్ల వైపు అడుగులు వేస్తోంది.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైకా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.. 15-18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సినేషన్కు ప్రభుత్వం అనుమతించిన తరుణంలో.. కేవలం మూడు రోజుల్లోనే కోటి మందికి పైగా టీనేజర్లు వ్యాక్సిన్ వేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.. మూడు రోజుల్లో కోటి మంది టీనేజర్లు కోవిడ్టీకాపంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. వ్యాక్సిన్వేయించుకోవడానికి ఉత్సాహం చూపుతున్న యువతను అభినందించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా… 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్పంపిణీ ప్రారంభమైన మూడు రోజులకే 1,24,02,515 టీకా డోసులను పంపిణీ చేసినట్లు వెల్లడించింది కేంద్రం.
Read Also: నేటి నుంచి కర్ఫ్యూ, ఆదివారం సంపూర్ణ లాక్డౌన్..
Also Read
ఇక, బుధవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 82,26,211 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా.. అందులో 37,44,635 డోసులు కేవలం టీనేజర్లు తీసుకున్నట్టు వెల్లడించింది ఆరోగ్యశాఖ.. టీకా తీసుకున్నవారికి అభినందనలు తెలుపుతూనే.. అర్హులైనవారు వీలైనంత త్వరగా టీకాలు అందుకోవాలని సూచించారు. కాగా, కోవిడ్ తొలి దశ వ్యాక్సినేషన్ను 2021 జనవరి 16వ తేదీన ప్రారంభించింది కేంద్రం.. ఈ దశలో వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్వర్కర్లకు వ్యాక్సిన్లు వేయగా.. రెండో దశను 2021 మార్చి 1న ప్రారంభించారు. ఈ విడతలో 60 ఏళ్లు పైబడినవారికి, 45 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి పంపిణీ చేశారు. ఇక, ఏప్రిల్ 1వ తేదీ నుంచి.. 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతోంది.. ఇక, ఈ నెల 3వ తేదీ నుంచి టీనేజర్లకు టీకా పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే.. మొత్తంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 148.58 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరిగింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!