Osamu Suzuki: భారత ఆటోమొబైల్స్ రంగాన్ని వెలుగు వెలిగించిన “ఒసాము సుజుకి” మరణం..
- ఆటోమొబైల్ దిగ్గజం ఒసాము సుజుకి కన్నుమూత..
- భారత్లో ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపిరి..
- ఆయన సేవలకు ‘‘పద్మభూషణ్’’ ఇచ్చిన భారత్..
Osamu Suzuki: జపనీస్ ఆటోమొబైల్స్ దిగ్గజం సుజుకి మోటార్ ఛైర్మన్, సీఈఓ ఒసాము సుజుకి(94) కన్నుమూశారు. ప్రాణాంతక లింఫోమాతో పోరాడుతూ డిసెంబర్ 25న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు తోషిహిరో సుజుకి తెలిపారు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇసాము సుజుకి 1930 జనవరి 30న ఓ జపనీస్ వ్యవసాయ కుటుంబంలో 4వ సంతానంగా జన్మించారు. మొదట్లో రాజకీయ నాయకుడు కావాలని ఆశించిన సుజుకీ, ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సుజుకీ మోటార్స్కి ఎక్కువ కాలం బాస్గా పనిచేశారు. టోక్యోలని చువో యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదవిని ఆయన జూనియర్ హైస్కూల్ టీచర్గా, నైట్ గార్డ్గా పార్ట్ టైమ్ జామ్ కూడా చేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బ్యాంక్లో పని చేశారు.
షోకో సుజుకితో వివాహం ఆయన జీవితాన్ని గొప్పమలుపు తిప్పింది. షోకో సుజుకి సుజికీ మోటార్స్ అధినేతకు మనవరాలు. ఆయనకు మగవారసులు లేకపోవడంతో, జపనీస్ ఆచారం ప్రకారం.. ఒసాము సుజుకి తన భార్య ఇంటి పేరును తీసుకుని ఆటోమొబైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 40 ఏళ్ల పాటు సుజుకి మోటార్స్ కంపెనీని నడిపించారు. 28 ఏళ్ల పాటు కంపెనీ ఛైర్మన్గా పనిచేశారు. 2015లో బాధ్యతల్ని తన కొడుకు తోహిహిరోకి అప్పగించినప్పటికీ, కంపెనీకి ఛైర్మన్, సీఈవోగా కొనసాగారు.
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
భారత ఆటోమొబైల్స్ రంగానికి ఓ వెలుగునిచ్చాడు
లైసెస్సు పాలన, క్లోజ్డ్ ఎకానమిగా భారత్ ఉన్న సమయంలోనే, భారత్లో ఆటోమొబైల్ రంగం విస్తరిస్తుందని ఊహించిన ఒసాము సుజుకీ 1981లో దేశంలోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. దేశంలో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ పెరగడానికి కారణమయ్యారు. మారుతీ ఉద్యోగ లిమిటెడ్ తర్వాత మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్గా మారింది. సుజుకీ మోటార్ కార్పొరేషన్లో మెజారిటీ వాటా ఉన్న ప్రభుత్వం 2007లో దాని నుంచి బయటకు వచ్చింది. మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్కు ఒసాము సుజుకి డైరెక్టర్ మరియు గౌరవ ఛైర్మన్గా ఉన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ, భారత్-జపాన్ బంధానికి వారధిగా నిలిచిన ఒసాముకి భారత ప్రభుత్వం ‘‘పద్మభూషణ్’’తో సత్కరించింది. దేశంలో ఇప్పటికీ ఐకానిక్ కారుగా ఉన్న మారుతి 800ని పరిచయం చేయడంలో ఒసాము సుజుకి పాత్ర ఉంది. ఈ కారు దేశంలో కార్ మార్కెట్ విస్తరణకు ఉత్ప్రేరకంగా పనిచేసింది.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!