MLC Kavitha: కవితకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల మద్దతు.. దీక్షకు హాజరుకానున్న 16 పార్టీల ప్రతినిధులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11న ఈడీ ముందు ఆమె హాజరుకాబోతున్నారు. మరోవైపు రేపు జంతర్ మంతర్ వేదికగా మహిళా బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తూ..కవిత దీక్ష చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. రేపు జరగబోయే దీక్షకు 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు.
Read Also: Spy Pigeon: ఒడిశా తీరంలో గూఢచార పావురం కలకలం.. కెమెరా, మైక్రోచిప్తో సెటప్..
Also Read
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
ఇప్పటికే కవిత దీక్షకు పలు పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. దీక్షకు సంఘీభావంగా బీఆర్ఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆకలిదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సిపిఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఆప్, ఆర్ఎల్డి, జేఎమ్ఎమ్ పార్టీల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. వీరితో పాటు స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా హాజరుకానున్నారు. జంతర్ మంతర్ వేదికగా విపక్షాలు బలపదర్శన చేయనున్నాయి.
“భారత్ జాగృతి” ఆధ్వర్యంలో రేపు నిరాహార దీక్ష చేయనున్నారు కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి, ఆమోదించాలనే డిమాండ్ తో నిరాహార దీక్ష చేయనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీతారాం ఏచూరి, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంకా చతుర్వేది హాజరుకానున్నారు. ముగింపు కార్యక్రమానికి సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, తృణమూల్ కాంగ్రెస్ నేత సుస్మిత దేవ్, జేడీయూ నేత త్యాగి హాజరుకానున్నారు. నిరాహార దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవిత పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. దీని తర్వాత జంతర్ మంతర్ వద్ద దీక్షాస్థలిని పరిశీలిస్తారు, ఆ తరువాత సిపిఎమ్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!