MLC Kavitha: కవితకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల మద్దతు.. దీక్షకు హాజరుకానున్న 16 పార్టీల ప్రతినిధులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11న ఈడీ ముందు ఆమె హాజరుకాబోతున్నారు. మరోవైపు రేపు జంతర్ మంతర్ వేదికగా మహిళా బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తూ..కవిత దీక్ష చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. రేపు జరగబోయే దీక్షకు 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు.
Read Also: Spy Pigeon: ఒడిశా తీరంలో గూఢచార పావురం కలకలం.. కెమెరా, మైక్రోచిప్తో సెటప్..
Also Read
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్లో బీజేపీ క్లీన్ స్వీప్!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
ఇప్పటికే కవిత దీక్షకు పలు పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. దీక్షకు సంఘీభావంగా బీఆర్ఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆకలిదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సిపిఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఆప్, ఆర్ఎల్డి, జేఎమ్ఎమ్ పార్టీల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. వీరితో పాటు స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా హాజరుకానున్నారు. జంతర్ మంతర్ వేదికగా విపక్షాలు బలపదర్శన చేయనున్నాయి.
“భారత్ జాగృతి” ఆధ్వర్యంలో రేపు నిరాహార దీక్ష చేయనున్నారు కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి, ఆమోదించాలనే డిమాండ్ తో నిరాహార దీక్ష చేయనున్నారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీతారాం ఏచూరి, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంకా చతుర్వేది హాజరుకానున్నారు. ముగింపు కార్యక్రమానికి సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, తృణమూల్ కాంగ్రెస్ నేత సుస్మిత దేవ్, జేడీయూ నేత త్యాగి హాజరుకానున్నారు. నిరాహార దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవిత పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. దీని తర్వాత జంతర్ మంతర్ వద్ద దీక్షాస్థలిని పరిశీలిస్తారు, ఆ తరువాత సిపిఎమ్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!