NTV Telugu Site icon

PM Modi: పాకిస్తాన్ గాజులు తొడుక్కోని కూర్చోలేదని ఇండియా కూటమి చెబుతోంది.. మేం తొడుక్కునేలా చేస్తాం..

Pm Modi

Pm Modi

PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ‘‘పాకిస్తాన్ అణుశక్తికి బయపడే పిరికివాళ్లు’’గా అభివర్ణించారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, ఇటీవల నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ గురించి చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. ఇండియా కూటమిలో పాకిస్తాన్‌కి భయపడే నాయకులు ఉన్నారని, వారి అణుశక్తి గురించి వారికి పీడకలలు వస్తున్నాయని చెప్పారు.

Read Also: Madhavilatha: పోలింగ్ కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత హల్ చల్.. కేసు నమోదు..!

పీఓకేను భారత్ స్వాధీనం చేసుకుంటుందనే బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఇటీవల ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, వారు గాజులు తొడుక్కుని లేరని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మోడీ మాట్లాడుతూ..‘‘ పాకిస్తాన్ గాజులు ధరించకపోతే, మేము ఆ దేశానికి వాటిని ధరించేలా చేస్తాం. వారికి ఆహారధాన్యాలు లేవని నాకు తెలుసు. ఇప్పుడు వారి వద్ద తగినంత గాజులు కూడా లేవని తెలుసు’’ అని ప్రధాని అన్నారు.

ఉగ్రవాదంపై పాకిస్తాన్‌కి క్లీన్‌చిట్ ఇచ్చే, సర్జికల్ స్ట్రైక్స్‌పై సందేహాలు లేవనెత్తే పిరికివాళ్లు ఇండియా కూటమిలో ఉన్నారని, మనం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వామపక్షాలు మన అణ్వాయుధాలను నిర్మూలించాలని కోరుకుంటున్నాయని చెప్పారు. అదికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, ఆర్జేడీలు దోపిడీలు, కిడ్నాప్‌లతో జంగిల్ రాజ్‌ని తీసుకువచ్చాయని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నారని, మోడీ బతికున్నంత కాలం ఇది జరగదని ప్రధాని స్పష్టం చేశారు.