Operation Sindoor: భారత్ దెబ్బకు ఇంకా “రన్వే”లు రిపేర్ చేసుకునే పనిలో పాకిస్తాన్..
- భారత్ దెబ్బకు రన్వేలు రిపేర్ చేసుకుంటున్న పాకిస్తాన్..
- రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ ‘‘నోటామ్ ’’ జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పహల్గాం ఉగ్రవాద ఘటన తర్వాత, భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’తో విరుచుకుపడింది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఇందులో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ హెడ్క్వార్టర్స్ అయిని మురిడ్కే, బహవల్పూర్ కూడా ఉన్నాయి. 100 మందికిపైగా టెర్రరిస్టులు ఈ దాడుల్లో హతమయ్యారు. అయితే, ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్పైకి దాడులు ప్రారంభించింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
పాకిస్తాన్ కవ్వింపులకు సమాధానంగా భారత్, పాకిస్తాన్లోని 11 వైమానిక స్థావరాలను క్షిపణులతో ధ్వంసం చేసింది. ముఖ్యంగా, పాక్ సైన్యం ప్రధాన కార్యాలయంలో ఉండే రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని భారత్ అటాక్ చేసింది. నూర్ ఖాన్తో పాటు సర్గోదా, రహియ్ యార్ ఖాన్, రఫీకీ, చక్లాలా, సుక్కూర్, సియాల్ కోట్ వంటి ఎయిర్ బేస్లు భారత దాడుల్లో ధ్వంసమయ్యాయి.
Also Read
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
Read Also: AK-203 Rifle: భారత్ కా ‘షేర్’ AK-203.. నిమిషానికి 700 బుల్లెట్లు, 800 మీటర్ల రేంజ్..
అయితే, ఇప్పుడు పాకిస్తాన్ ధ్వంసమైన వైమానిక స్థావరాలను గత రెండు నెలల నుంచి పునరుద్ధరిస్తూనే ఉంది. ముఖ్యంగా, దెబ్బతిన్న రన్వేలను రిపేర్ చేస్తోంది. ఇదే కాకుండా కీలకమైన మిలిటరీ ఇన్స్టాలేషన్లను మళ్లీ నిర్మించే పనిలో ఉంది. తాజాగా, రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ రన్వేని మూసివేతను మూడోసారి పొడగించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ ఎయిర్ బేస్ రన్వేను భారత్ ధ్వంసం చేసింది. రన్వేపై పెద్ద గుంత ఏర్పడింది.
రన్వే పునరుద్ధరణ కోసం పాకిస్తాన్ తాజాగా ‘‘నోటమ్’’ జారీ చేసింది. ఆగస్టు 5 వరకు రన్వే కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఎలాంటి కారణం పేర్కొనకుండా నోటమ్ జారీ చేసినట్లు తెలుస్తోంది. మే 10 తర్వాత భారత్ దాడి చేయడం వల్ల తొలిసారి నోటమ్ జారీ చేసింది. అప్పటి వరకు విమాన కార్యకలాపాలకు అందుబాటులో ఉండదని పేర్కొంది. పంజాబ్ ప్రావిన్సులో ఉన్న ఈ రహీమ్ యార్ ఖాన్ ఇటు పాక్ మిలిటరీ, అటు పౌర విమాన సేవలు అందించే షేక్ జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిగి ఉంది.
తాజావార్తలు
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!