Indian Railways: ఇకపై కన్ఫామైన టికెట్ ఉంటేనే ప్లాట్ఫామ్ పైకి అనుమతి.. రైల్వే కీలక నిర్ణయం.
- ఇకపై కన్ఫామ్ టికెట్ ఉంటేనే ప్లాట్ఫామ్ పైకి ప్రయాణికులు..
- రద్దీని తగ్గించేందుకు రైల్వే కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కన్ఫామ్ టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్ఫామ్పైకి అనుమతించనున్నారు. దేశంలో అతిపెద్దవైన 60 రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. స్టేషన్లలో రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికుల భద్రతను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ముఖ్యమైన స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి.
Read Also: Hizbul Mujahideen: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్.. యూపీలో దాడులకు కుట్ర..
Also Read
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
భారత రైల్వే పండగలు, సెలవుల సమయంలో రద్దీని ఎదుర్కొంటున్నాయి. చాలా మంది తమ బంధువుల్ని దింపడానికి, లేదా వారిని తీసుకెళ్లేందుకు రైల్వే స్టేషన్లకు వస్తుంటారు. ఇది రద్దీకి దారి తీస్తోంది. కొత్త నిబంధనల వల్ల ఇలాంటి వారిని స్టేషన్లోకి అనుమతించరు. దేశంలోని 60 అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఈ నిబంధనల్ని అమలు చేస్తారు. ఈ జాబితాలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఛత్రపతి శివాజీ టెర్మినస్-ముంబై, హౌరా జంక్షన్, చెన్నై సెంట్రల్, బెంగళూర్ సిటీ రైల్వే స్టేషన్ ఉన్నాయి. జన రద్దీ నియంత్రణ అవసరాలను బట్టి అదనపు స్టేషన్ల జాబితాను చేర్చనున్నారు.
ప్రయాణికులు ముందస్తు బుకింగ్ టికెట్ బుకింగ్ చేసుకోవాలని, వారు రైల్వే స్టేషన్కి వచ్చిన సమయంలో టికెట్ కన్ఫామ్ అయినట్లు నిర్ధారించుకోవాలి. ఈ కొత్త విధానం ప్లాట్ఫామ్లపై రద్దీని తగ్గించాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసకున్నారు. ఎంపిక చేసిన స్టేషన్ పరిసరాల్లో కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. పెద్ద రైల్వే స్టేషన్లలో వార్ రూమ్లను ఏర్పాటు చేయనున్నారు. రద్దీగా ఉన్న సమయంలో అధికారుల మధ్య సమన్వయానికి ఇది ఉపయోగపడుతుంది. సర్వీస్ స్టాఫ్ని సులభంగా గుర్తించేందుకు కొత్త యూనిఫాంను జారీ చేయనున్నారు.
తాజావార్తలు
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
-
Keerthy Suresh : 41 గంటల నాన్-స్టాప్ షూటింగ్లో పాల్గొన్న కీర్తిసురేష్
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!