Madhya Pradesh: ఆస్పత్రిలో దారుణం.. అందరూ చూస్తుండగా యువతి గొంతు కోసి చంపిన యువకుడు
- మధ్యప్రదేశ్ ఆస్పత్రిలో దారుణం
- అందరూ చూస్తుండగా యువతి గొంతు కోసి చంపిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాబోయ్.. రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఆడ పిల్లల భద్రత కోసం ఎన్ని కఠిన చట్టాలొచ్చినా వారి భద్రతకు ముప్పు పొంచే ఉంది. కఠిన చట్టాలు ఉన్నాయని తెలిసినా కూడా మృగాళ్లు మరింత రెచ్చిపోయి ఘాతుకాలకు తెగబడుతున్నారు. బయటకెళ్తే రక్షణ లేదేమో అనుకోవచ్చు.. కానీ పట్టపగలు ఆస్పత్రిలోనే రక్షణ లేదు. అందరూ చూస్తుండగా ఒక యువతి గొంతు కోసి చంపుతుంటే చుట్టూ పదులకొద్దీ జనం ఉన్న కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. ప్రేక్షకుల్లా చూస్తూ వీడియోలు తీశారు. దుర్మార్గుడు.. యువతిని చంపేసి తాపీగా బయటకు వెళ్లి బైక్పై పరారయ్యాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Railway Charges : రైల్వే ప్రయాణికులకు షాక్.. ఛార్జీల పెంపు..
Also Read
మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లా ఆస్పత్రిలో 19 ఏళ్ల సంధ్య చౌదరి అనే విద్యార్థిని నర్సింగ్ ట్రైనింగ్ పొందుతోంది. ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఉన్న సంధ్యపై అభిషేక్ కోష్టి అనే యువకుడు అమాంతంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతి గొంతు కోస్తుంటే.. చుట్టూ జనం ఉన్న ఆపే ప్రయత్నం చేయలేదు. కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ప్రేక్షకుల్లా మొబైల్లో వీడియోలు తీశారు. నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు నటించినా.. అనంతరం ఆస్పత్రి బయటకు వెళ్లి బైకుపై పరారయ్యాడు.
ఇది కూడా చదవండి: Crime News Today: జగ్గయ్యపేటలో దారుణం.. కొడుకుని కడతేర్చిన తండ్రి!
అయితే సంధ్య-అభిషేక్ మధ్య స్నేహం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కొంత కాలం నుంచి సంధ్య యువకుడికి దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో యువకుడు.. ఆమెపై పగ పెంచుకున్నాడు. జూన్ 27న ఘటన జరిగి ఉండగా తాజాగా వీడియో వైరల్ అవుతోంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. రెండేళ్ల నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేశామని.. కస్టడీలో అతడిని విచారిస్తున్నట్లు చెప్పారు.
నల్ల చొక్కా ధరించిన అభిషేక్, తెల్ల షర్ట్ వేసుకున్న సంధ్య రూమ్ నెంబర్ 22 వెలుపల మాట్లాడుకున్నారు. అనంతరం సంధ్యను చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే నేలకేసి విసిరాడు. అటు తర్వాత ఆమె ఛాతీపై కూర్చుని గొంతు కోశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మొబైల్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాదాపు ఈ ఘటన 10 నిమిషాల పాటు జరిగింది. విచిత్రమేంటంటే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వారితో పాటు వార్డు బాయ్లు, వైద్యులు, నర్సులు కూడా ఉన్నారు. కానీ ఎవరూ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనతో ఆస్పత్రిలో రోగులు, బంధువులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆస్పత్రిలో ఉన్న రోగులు డిశ్చార్జ్ అయిపోయారు. భారీగా రక్తస్రావం కావడంతో సంధ్య అక్కడే చనిపోయింది. ఉదయం చనిపోతే.. మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటి వరకు మృతదేహం అలానే ఉంచారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi తమ్ముడి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ ఇదే..
-
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
-
Home Cleaning Tips : ఇంట్లో దుర్వాసన వస్తోందా? కారణం ఇదే కావచ్చు.. ఈ చిన్న మార్పులతో ఇల్లు రోజంతా ఫ్రెష్గా ఉంటుంది!
-
Vastu Tips: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ 4 విషయాలు కనిపిస్తే రోజంతా పాజిటివ్గా ఉంటారా? వాస్తు ఏమి చెబుతోంది?
-
Canada vs Bosnia: సూపర్ సబ్ ‘లారిన్’ మ్యాజిక్.. బోస్నియా, కెనడా 1-1తో డ్రా.!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!